సింహాచలంలో విరాట్ కోహ్లీ, సుంద‌ర్ పూజ‌లు

Spread the love

ఘ‌నంగా స్వాగ‌తం ప‌లికిన ఆల‌య క‌మిటీ స‌భ్యులు

విశాఖ‌ప‌ట్నం జిల్లా : ప్ర‌ముఖ భార‌తీయ క్రికెట‌ర్లు విరాట్ కోహ్లీ, వాషింగ్ట‌న్ సుంద‌ర్ లు ఆదివారం సంద‌డి చేశారు. ఈ ఇద్ద‌రు క్రికెట‌ర్లు విశాఖ వాసుల‌తో పాటు ఫ్యాన్స్ ను విస్తు పోయేలా చేశారు. అత్యంత ప్ర‌సిద్ద‌మైన పుణ్య క్షేత్రంగా పేరు పొందింది వివాఖ ప‌ట్నం జిల్లాలోని సింహాచంలో కొలువుతీరిన శ్రీ ల‌క్ష్మీ న‌ర‌సింహ స్వామి ఆల‌యం. ఇక్క‌డ ద‌ర్శించుకుని పూజ‌లు చేస్తే కోరిన కోర్కెలు త‌ప్ప‌కుండా తీరుతాయ‌ని భ‌క్తుల న‌మ్మ‌కం, విశ్వాసం కూడా.

ఇదిలా ఉండ‌గా స్వామి వారిని ద‌ర్శించు కునేందుకు విచ్చేసిన విరాట్ కోహ్లీ, వాషింగ్ట‌న్ సుంద‌ర్ ల‌కు ఘ‌న స్వాగ‌తం ప‌లికారు సింహాచ‌ల‌యం ఆల‌య క‌మిటీ పాల‌క మండ‌లితో పాటు ఈవో, పూజారులు. స్వామి వారి స‌న్నిధిలో పూజ‌లు చేశారు. వేద పండితులు, ఆచార్యులు ఆశీర్వ‌చ‌నాలు అంద‌జేశారు. అనంత‌రం ఆల‌యం త‌ర‌పున స్వామి వారి చిత్ర ప‌టంతో పాటు ప్ర‌సాదాన్ని అందించారు. స్వామి వారిని ద‌ర్శించుకున్న అనంత‌రం విరాట్ కోహ్లీ మీడియాతో మాట్లడారు. ఈ ప్ర‌దేశం అద్భుతంగా ఉంద‌న్నాడు.

  • Related Posts

    18న మార్చి నెల దర్శన కోటా విడుద‌ల

    Spread the love

    Spread the loveప్ర‌క‌టించిన తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం తిరుమల : 2026 మార్చి నెలకు సంబంధించి టీటీడీ విడుదల చేసే వివిధ దర్శనాల, గదుల కోటా వివరాలు ఈ విధంగా ఉన్నాయి.తిరుమ‌ల శ్రీ‌వారి ఆర్జిత సేవా టికెట్ల ( సుప్రభాతం, తోమాల,…

    తిరుమ‌ల‌లోని ర‌హ‌దారుల‌కు శ్రీ‌వారి నామాలతో పేర్లు

    Spread the love

    Spread the loveటీటీడీ ఛైర్మ‌న్ బిఆర్ నాయుడు కీల‌క ప్ర‌క‌ట‌న తిరుమ‌ల : తిరుమ‌ల‌లోని ర‌హ‌దారుల‌కు శ్రీ‌వారి నామాలతో పేర్లు పెట్ట‌నున్న‌ట్లు ప్ర‌క‌టించారు టీటీడీ చైర్మ‌న్ బీఆర్ నాయుడు. టిటిడి ఇంజనీరింగ్‌ విభాగంలో నాలుగు కేటగిరిలలో ఖాళీగా ఉన్న 60 పోస్టులకు…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *