భ‌గవ‌ద్గీత ప్ర‌పంచానికి దిక్సూచి

Spread the love

హిందూ ధ‌ర్మ ప్ర‌చార ప‌రిష‌త్

తిరుప‌తి : భ‌గ‌వ‌ద్గీత ప్ర‌తి ఒక్క‌రినీ క‌దిలించే గొప్ప ఆయుధ‌మ‌ని పేర్కొన్నారు హిందూ ధర్మ ప్రచార పరిషత్ కార్యదర్శి శ్రీరాం రఘునాథ్. గీతా జ‌యంతిని పుర‌స్క‌రించుకుని సంస్థ ఆధ్వ‌ర్యంలో పోటీలు నిర్వ‌హించారు. ఈ సంద‌ర్బంగా మూడు కేట‌గిరీల‌లో నిర్వ‌హించిన పోటీల‌లో ప్ర‌థ‌మ‌, ద్వితీయ‌, తృతీయ స్థానాలలో విజేత‌ల‌ను ఎంపిక చేశారు నిర్వాహ‌కులు. ఈ సంద‌ర్భంగా విజేత‌లైన వారికి బహుమతులు ప్రదానం చేశారు.

ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో 59 కేంద్రాలతోపాటు, చెన్నై, బెంగుళూరు నందు ఈ గీతా జయంతి వేడుకలను హిందూ ధర్మ ప్రచార పరిషత్, తిరుమల తిరుపతి దేవస్థానంలో ఆధ్వర్యంలో భగవద్గీత కంఠస్థ పోటీలు జరిగాయి. దాదాపు 8500 మంది బాల బాలికలు ఈ పోటీల్లో పాల్గొన్నారు. అంతకుముందు ఆముదాల మురళి, కేటివి రాఘవన్, సునీత తదితరులు న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించారు. న్యాయ నిర్ణేతలను హెచ్ డి పి పి కార్యదర్శి సన్మానించారు.

ఈ కార్యక్రమానికి వ్యాఖ్యాతగా హెడ్డిపిపి ఏఈవో సి. సత్యనారాయణ, ప్రోగ్రాం కో ఆర్డినేటర్ కోకిల, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, సిబ్బంది , ఇతర అధికారులు పాల్గొన్నారు.

  • Related Posts

    సింహాచ‌లం అప్ప‌న్న స‌న్నిధిలో శ్రీ‌లీల‌

    Spread the love

    Spread the loveప్ర‌త్యేక పూజ‌లు చేసిన న‌టిమ‌ణి , త‌ల్లి కూడా విశాఖ‌ప‌ట్నం జిల్లా : ప్ర‌ముఖ న‌టి శ్రీ‌లీల సంద‌డి చేశారు. కోరిన కోర్కెలు తీర్చే కొంగు బంగారంగా విలసిల్లుతోంది విశాఖ‌ప‌ట్నం జిల్లాలోని పేరు పొందిన సింహాచ‌లం ఆల‌యం. ఇక్క‌డ…

    శ్రీ ర‌మ‌ణ దీక్షితులు ప్ర‌య‌త్నం అభినంద‌నీయం

    Spread the love

    Spread the loveప్ర‌శంసలు కురిపించిన టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు తిరుమ‌ల : తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం పాల‌క మండ‌లి (టీటీడీ) చైర్మ‌న్ బీఆర్ నాయుడు కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. శ్రీవారి ఆలయ మాజీ ప్రధాన అర్చకులు శ్రీ రమణ దీక్షితులు…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *