భ‌గవ‌ద్గీత ప్ర‌పంచానికి దిక్సూచి

Spread the love

హిందూ ధ‌ర్మ ప్ర‌చార ప‌రిష‌త్

తిరుప‌తి : భ‌గ‌వ‌ద్గీత ప్ర‌తి ఒక్క‌రినీ క‌దిలించే గొప్ప ఆయుధ‌మ‌ని పేర్కొన్నారు హిందూ ధర్మ ప్రచార పరిషత్ కార్యదర్శి శ్రీరాం రఘునాథ్. గీతా జ‌యంతిని పుర‌స్క‌రించుకుని సంస్థ ఆధ్వ‌ర్యంలో పోటీలు నిర్వ‌హించారు. ఈ సంద‌ర్బంగా మూడు కేట‌గిరీల‌లో నిర్వ‌హించిన పోటీల‌లో ప్ర‌థ‌మ‌, ద్వితీయ‌, తృతీయ స్థానాలలో విజేత‌ల‌ను ఎంపిక చేశారు నిర్వాహ‌కులు. ఈ సంద‌ర్భంగా విజేత‌లైన వారికి బహుమతులు ప్రదానం చేశారు.

ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో 59 కేంద్రాలతోపాటు, చెన్నై, బెంగుళూరు నందు ఈ గీతా జయంతి వేడుకలను హిందూ ధర్మ ప్రచార పరిషత్, తిరుమల తిరుపతి దేవస్థానంలో ఆధ్వర్యంలో భగవద్గీత కంఠస్థ పోటీలు జరిగాయి. దాదాపు 8500 మంది బాల బాలికలు ఈ పోటీల్లో పాల్గొన్నారు. అంతకుముందు ఆముదాల మురళి, కేటివి రాఘవన్, సునీత తదితరులు న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించారు. న్యాయ నిర్ణేతలను హెచ్ డి పి పి కార్యదర్శి సన్మానించారు.

ఈ కార్యక్రమానికి వ్యాఖ్యాతగా హెడ్డిపిపి ఏఈవో సి. సత్యనారాయణ, ప్రోగ్రాం కో ఆర్డినేటర్ కోకిల, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, సిబ్బంది , ఇతర అధికారులు పాల్గొన్నారు.

  • Related Posts

    ఘనంగా చంద్రన్న జన్మదిన వేడుకలు

    Spread the love

    Spread the loveభారీ ఎత్తున హాజ‌రైన టీడీపీ కార్య‌క‌ర్త‌లు శ్రీ స‌త్య‌సాయి జిల్లా : ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు పుట్టిన రోజు ఇవాళ‌. ఈ సంద‌ర్బంగా తెలుగుదేశం పార్టీ ఆధ్వ‌ర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఘ‌ఘ‌నంగా వేడుక‌లు చేప‌ట్టారు. ప‌లువురు…

    సీఎం జ‌న్మ‌దినం టీటీడీ అన్న ప్ర‌సాదానికి విరాళం

    Spread the love

    Spread the loveరూ. 44 ల‌క్ష‌లు ఇచ్చిన భాష్యం విద్యా సంస్థ‌లు తిరుమ‌ల : ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు పుట్టిన రోజు ఏప్రిల్ 20. ఆయ‌న బ‌ర్త్ డే సంద‌ర్బంగా ఇవాళ తిరుమ‌ల‌లోని అన్న ప్రసాదానికి రూ.44 లక్షల…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *