శ‌శాంక్ క‌నుమూరిని అభినందించిన సీఎం

Spread the love

ఏషియ‌న్ ఛాంపియ‌న్ షిప్ లో ప్ర‌తిభ

అమ‌రావ‌తి : ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు సిల్వ‌ర్ మెడ‌ల్ సాధించిన ఏపీలోని భీమ‌వ‌రానికి చెందిన శశాంక్ క‌నుమూరిని అభినందించారు. థాయ్ పొలో క్లబ్ ఆధ్వర్యంలో జరిగిన ఈవెంటింగ్ ఏషియన్ ఛాంపియన్ షిప్-2025లో దేశం తరపున ప్రాతినిధ్యం వహించాడు. ఈక్వెస్ట్రియన్ ఈవెంటింగ్ క్రీడలో అద్బుత‌మైన ప్ర‌తిభ‌ను చాటాడు. అంద‌రినీ విస్తు పోయేలా చేశాడు. చివ‌ర‌కు ప‌తకాన్ని కైవ‌సం చేసుకున్నాడు. ఈ సంద‌ర్బంగా తాను సాధించిన మెడ‌ల్ తో ముఖ్య‌మంత్రిని మ‌ర్యాద పూర్వ‌కంగా అమ‌రావ‌తిలోని స‌చివాల‌యంలో క‌లిశాడు.

ఈ సంద‌ర్బంగా టోర్నీలో త‌న అనుభ‌వాన్ని ముఖ్య‌మంత్రితో పంచుకున్నాడు. గుర్రాలతో హర్డిల్స్ దాటే ఈక్వెస్ట్రియన్ ఈవెంటింగ్ లో తనకు పదేళ్ల అనుభవం ఉందని క్రీడాకారుడు శశాంక్ తెలిపారు. రాష్ట్రానికి పేరు తెచ్చిన క్రీడాకారుడు శశాంక్ కనుమూరి మరింతగా రాణించాలని ఆకాంక్షించారు నారా చంద్ర‌బాబు నాయుడు. రాబోయే రోజుల్లో బంగారు ప‌త‌కాల‌తో రావాల‌ని కోరారు. ఈ సంద‌ర్బంగా కీల‌క సూచ‌న‌లు చేశారు శ‌శాంక్ కు. ప్ర‌భుత్వ ప‌రంగా ఎలాంటి స‌హాయ‌మైనా చేసేందుకు సిద్దంగా ఉన్నామ‌ని, క్రీడ‌పై మ‌రింత ప‌ట్టు పెంచుకునేందుకు కృషి చేయాల‌ని సూచించారు.

  • Related Posts

    అంద‌రి క‌ళ్లు సంజు శాంస‌న్ పైనే

    Spread the love

    Spread the loveసీఎస్కే జ‌ట్టులో చేరిన కేర‌ళ క్రికెట‌ర్ చెన్నై : ఐసీసీ టి20 వ‌ర‌ల్డ్ క‌ప్ 2026లో టాప్ లో నిలిచాడు కేర‌ళ స్టార్ క్రికెట‌ర్ సంజు శాంస‌న్. త‌ను దేశ వ్యాప్తంగా హీరోగా మారాడు. అంతే కాదు త‌న…

    సంజు సామ్సన్ నాకు ప్రేర‌ణ : జితేష్ శ‌ర్మ‌

    Spread the love

    Spread the loveత‌న ఆట‌తీరు, వ్య‌క్తిత్వం అద్బుతం ముంబై : ప్ర‌ముఖ క్రికెట‌ర్ జితేష్ శ‌ర్మ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశాడు. త‌ను ఇప్పుడు ఈ ఏడాది జ‌రిగే ఐపీఎల్ టోర్నీపై ఫోక‌స్ పెట్ట‌నున్నాడు. ప్ర‌త్రి క్రికెట‌ర్ కు ఎప్పుడో ఒకప్పుడు ఛాన్స్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *