సంజూ శాంస‌న్ కు బీసీసీఐ బిగ్ షాక్

Spread the love

కాంట్రాక్టు కింద సి కేట‌గిరి లోకి మార్పు

ముంబై : కేర‌ళ స్టార్ క్రికెట‌ర్ సంజూ శాంస‌న్ కు కోలుకోలేని షాక్ తగిలింది. భార‌త క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) ఝ‌ల‌క్ ఇచ్చింది. ప్ర‌తి ఏటా బీసీసీఐ ఆయా ఆట‌గాళ్ల‌కు సంబంధించి ఒప్పందం జాబితాను ప్ర‌క‌టిస్తుంది. ఇందులో మూడు కేట‌గిరీలు ఉంటాయి. ప్ర‌తిభ, అనుభ‌వం ఆధారంగా క్రికెట‌ర్ల‌ను చేరుస్తుంది. ఇక ఈ ఏడాది అంత‌గా క‌లిసి రాలేదు సంజూ శాంస‌న్ కు. దేశివాళి పోటీల్లో దుమ్ము రేపి, ప‌రుగుల వ‌ర‌ద పారించిన త‌ను న్యూజిలాండ్ తో జ‌రిగిన టి20 సీరీస్ లో తేలి పోయాడు. ఐదు మ్యాచ్ లు ఆడితే కేవ‌లం 50 ప‌రుగులు మాత్ర‌మే చేశాడు.

ఇందులో 10, 6, 0, 6, 24 రన్స్ మాత్ర‌మే ఉన్నాయి. దీంతో త‌ను చేజేతులారా టి20 వ‌ర‌ల్డ్ క‌ప్ నుంచి నిష్క్ర‌మించాడు. త‌న‌ను బీసీసీఐ సెలెక్ష‌న్ క‌మిటీ ప‌ట్టించు కోలేదు. ఇదిలా ఉండ‌గా తాజాగా బీసీసీఐ ప్ర‌క‌టించిన కాంట్రాక్టు కు సంబంధించిన వివ‌రాల‌ను అధికారికంగా వెల్ల‌డించారు బీసీసీఐ ఉపాధ్య‌క్షుడు, కాంగ్రెస్ ఎంపీ రాజీవ్ శుక్లా. ఆయ‌న మీడియాతో మాట్లాడారు. సి – కేట‌గిరీలో అక్ష‌ర్ ప‌టేల్, తిల‌క్ వ‌ర్మ‌, శివ‌మ్ దూబే, సంజూ శాంస‌న్, అర్ష్ దీప్ సింగ్, ప్ర‌సిద్ద కృష్‌ణ‌, ఆకాష్ దీప్ , ధ్రువ్ జురేల్ , హ‌ర్షిత్ రాణా, వ‌రుణ్ , నితీష్ రాణా, అభిషేక్ శ‌ర్మ‌, సాయి సుద‌ర్శ‌న్ , బిష్ణోయ్, రుతురాజ్ ఉన్నార‌ని తెలిపారు రాజీవ్ శుక్లా.

  • Related Posts

    విశ్వ విజేత‌ల‌కు ప్ర‌ధాని మోదీ అభినంద‌న‌లు

    Spread the love

    Spread the loveకుర్రాళ్లు అద్భుతం చేశారంటూ ప్ర‌శంస‌లు న్యూఢిల్లీ : హ‌రారే వేదిక‌గా జ‌రిగిన ఐసీసీ అండ‌ర్ -19 వ‌ర‌ల్డ్ క‌ప్ ఫైన‌ల్ లో భార‌త జ‌ట్టు కుర్రాళ్లు అద్భుతం చేశారు. ప్ర‌త్య‌ర్థి ఇంగ్లండ్ ను 100 ప‌రుగుల తేడాతో ఓడించి…

    సంజూ శాంస‌న్ అద్భుత‌మైన బ్యాట్స్ మెన్

    Spread the love

    Spread the loveబీసీసీఐ వైస్ ప్రెసిడెంట్ రాజీవ్ శుక్లా ముంబై : కేర‌ళ స్టార్ క్రికెట‌ర్ సంజూ శాంస‌న్ గురించి ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు బీసీసీఐ వైస్ ప్రెసిడెంట్ రాజీవ్ శుక్లా. ఆయ‌న జాతీయ మీడియాతో మాట్లాడారు. ఫామ్ లోకి రావ‌డం…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *