నేను ఇండియా టీంకు శత్రువును కాదు
పాకిస్తాన్ : స్టార్ బౌలర్ మహమ్మద్ అమీర్ షాకింగ్ కామెంట్స్ చేశాడు. ఇటీవల పరుగుల వరద పారిస్తూ రికార్డులను బ్రేక్ చేసిన ఇండియాకు చెందిన అభిషేక్ శర్మ ఉన్నట్టుండి ఐసీసీ టి20 టోర్నీలో పేలవమైన ఆట తీరుతో నిరాశ పరిచాడు. దీనిపై తీవ్రంగా స్పందించాడు అమీర్. నేను భారతదేశానికి శత్రువును కాదు. నిజానికి, పాకిస్తాన్ కంటే భారతదేశ మ్యాచ్లను చూడటం నాకు చాలా ఇష్టం అని చెప్పాడు. భారతదేశం ఓడిపోయినప్పుడు నాకు బాధగా ఉంటుందని చెప్పాడు. రెండు డకౌట్లకు అవుట్ అయిన తర్వాత కూడా, అభిషేక్ శర్మ నిర్భయమైన విధానాన్ని నేను ప్రశంసించానని తెలిపాడు.
కానీ సీనియర్ ఆటగాడిగా, అంతర్జాతీయ క్రికెట్ మీ బలహీనతలను బహిర్గతం చేస్తుందని నా ఉద్దేశ్యం. అతను తన టెక్నిక్పై మరింత పని చేయడానికి అవసరమైన నైపుణ్యాలను కలిగి ఉన్నాడని ప్రశంసలు కురిపించాడు బౌలర్ మహమ్మద్ అమీర్. ప్రతి బంతిలోనూ స్వింగ్ చేయడం అతని కెరీర్ను తగ్గించగలదని సూచించాడు. తాజాగా అమీర్ శర్మ గురించి చేసిన కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి.






