సంజు శాంస‌న్ ను 14 ఏళ్ల నుంచి చూస్తున్నా

Spread the love

కీల‌క వ్యాఖ్య‌లు చేసిన ఎంపీ శ‌శి థ‌రూర్

కేర‌ళ : తిరువ‌నంతపురం కాంగ్రెస్ పార్టీకి చెంద‌ని ఎంపీ శ‌శి థ‌రూర్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. మంగ‌ళ‌వారం ఆయ‌న మ‌రోసారి కేర‌ళ‌స్టార్ క్రికెట‌ర్ సంజూ శాంస‌న్ గురించి ప్ర‌స్తావించాడు. త‌ను శాంస‌న్ ను 14 ఏళ్ల వయసులో త్రివేండ్రంలోని ఒక క్లబ్ తరఫున ఆడుతున్నప్పుడు చూశాన‌ని తెలిపాడు. ఆ స‌మ‌యంలో త‌న‌లో ఏదో స్పార్క్ ఉంద‌ని గుర్తించాన‌ని పేర్కొన్నాడు ఎంపీ. అంత‌టితో ఆగ‌క తాను వెళ్లి శాంస‌న్ ను వ్య‌క్తిగ‌తంగా క‌లిశాన‌ని, త‌న‌ను అభినందించాన‌ని చెప్పాడు. ఆనాటి నుంచి నేటి దాకా శాంస‌న్ పై ఓ క‌న్నేసి ఉంచాన‌ని వెల్ల‌డించారు శ‌శి థ‌రూర్.

అంతే కాదు తాను అతని కెరీర్‌ను మొదటి నుండి చూస్తూ వ‌చ్చాన‌ని తెలిపాడు. తాను ఎంపీగా ఉన్న‌ప్ప‌టికీ తాను సంజుకి పెద్ద అభిమానినని పేర్కొన్నాడు ఎంపీ. అతని విలువను నిరూపించు కోవడానికి అతనికి ఎప్పుడూ చాలా కాలం పాటు అవకాశం ఇవ్వలేద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశాడు. కానీ ఇవాళ 11 ఏళ్ల త‌ర్వాత తాను అనుకున్నది సాధించాడ‌ని, తాను ఏమిటో నిరూపించుకునే ప్ర‌య‌త్నం చేశాడ‌ని ప్ర‌శంస‌లు కురిపించాడు. ఒక‌వేళ ఆ స్థానంలో ఎవ‌రు ఉన్నా అంత గొప్ప‌గా ఆడ‌లేక పోయి ఉండేవార‌ని త‌న అబిప్రాయాన్ని వ్య‌క్తం చేశారు శశి థరూర్.

  • Related Posts

    శ్రీ‌లంక టూర్ కు వైభ‌వ్ సూర్య‌వంశీ ఎంపిక

    Spread the love

    Spread the loveకెప్టెన్ గా హైద‌రాబాద్ కుర్రాడు తిల‌క్ వ‌ర్మ‌ ముంబై : భార‌త క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. శ్రీ‌లంక‌లో ప‌ర్య‌టించి భార‌త -ఎ – జ‌ట్టు ను ప్ర‌క‌టించింది. శ్రీలంకలో జరిగే ముక్కోణపు సిరీస్‌కు…

    శార్దూల్ ఠాకూర్ బౌలింగ్ మ్యాజిక్ పంజాబ్ కు ఝ‌ల‌క్

    Spread the love

    Spread the love4 ఓవ‌ర్లు 39 ర‌న్స్ 4 వికెట్లు తీసిన స్టార్ బౌల‌ర్ ధ‌ర్మ‌శాల : ఐపీఎల్ 19 సీజ‌న్ లో భాగంగా జ‌రిగిన లీగ్ మ్యాచ్ లో బుమ్రా సార‌థ్యంలోని ముంబై ఇండియ‌న్స్ అద్భుత విజ‌యాన్ని న‌మోదు చేసింది.…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *