సంజు శాంస‌న్ వ‌ల్ల‌నే వ‌ర‌ల్డ్ క‌ప్ గెలిచాం

క్రిష్ణ‌మాచారి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

చెన్నై : మాజీ క్రిక‌టెర్ క్రిష్ణ‌మాచారి శ్రీ‌కాంత్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశాడు కేర‌ళ స్టార్ ప్లేయ‌ర్ సంజు శాంస‌న్ గురించి. త‌ను ఆడ‌క పోతే ఇండియా టి20 వ‌ర‌ల్డ్ క‌ప్ గెలిచి ఉండేది కాద‌న్నాడు. త‌న నుంచి ఎన్నో నేర్చుకోవ‌చ్చ‌ని పేర్కొన్నాడు. భార‌త్ గెలుపొందిన అనంత‌రం కె. శ్రీ‌కాంత్ మీడియాతో మాట్లాడాడు. ఇది ఎవ‌రూ ఊహించ‌ని అద్భుత‌మైన‌, చిర‌స్మర‌ణీయ‌మైన విజ‌యం అని పేర్కొన్నాడు. ఇలాంటి క్ష‌ణాలు అరుదుగా వ‌స్తుంటాయ‌ని తెలిపాడు. ఒకానొక ద‌శ‌లో జ‌ట్టులో స్థానం కోల్పోయి అనుకోకుండా జ‌ట్టులోకి వ‌చ్చి ఆశ్చ‌ర్య పోయేలా జ‌ట్టుకు మూల స్తంభంగా మార‌డం మామూలు విష‌యం కాద‌న్నాడు సంజు శాంస‌న్ గురించి క్రిష్ణ‌మాచారి శ్రీ‌కాంత్.

ఇక్కడ రెండు పెద్ద పాఠాలు ఉన్నాయి. ఒకటి సంజు సామ్సన్. మీరు విఫలమైనా, ఆశను వదులుకోకండి. మీ సమయం వచ్చినప్పుడు, అది మిమ్మల్ని వేరే స్థాయికి తీసుకు వెళుతుందన్నాడు. రెండు బుమ్రా గురించి.. మీరు మిమ్మల్ని ఎలా సరిదిద్దుకుంటారు, మీరు కొంచెం ఆత్మ శోధన చేసి తిరిగి రావాలి. ముఖ్యంగా సంజు అతను ఎంత మానసికంగా దృఢంగా ఉన్నాడో, అతను తిరిగి వచ్చిన విధానం అద్బుతం అంటూ కొనియాడాడు. త‌ను ఆటను మార్చుకోలేదు, కానీ మానసిక వైఖరిలో కొద్దిగా మార్పు వచ్చింద‌న్నాడు.

  • Related Posts

    ఐపీఎల్ 2027లో ఎంఎస్ ధోనీ ఆడేది క‌ష్ట‌మే ..?

    చెన్నై : అంద‌రి క‌ళ్లు మ‌హేంద్ర సింగ్ ధోనీపై ఉన్నాయి. ఈ ఏడాది 2026లో జ‌రిగిన ఐపీఎల్ లో ఆశించిన మేర రాణించ‌లేదు సీఎస్కే జ‌ట్టు. నిరాశజనకమైన ప్రదర్శనతో ప్లేఆఫ్స్‌కు చేరలేక పోయింది, ఇది అభిమానులను తీవ్ర నిరాశకు గురిచేసింది. దీనికి…

    ఐపీఎల్ సరైన సమయంలో జరగడం లేదు

    ఇంగ్లండ్ : ఐపీఎల్ మాజీ చైర్మ‌న్ ల‌లిత్ మోడీ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. భార‌త దేశంలో తొలిసారిగా ఇండియ‌న్ ప్రిమీయ‌ర్ లీగ్ ను ప్రారంభించినప్పుడు ఏప్రిల్-మే నెలల విండోను ఎవరూ కోరుకో లేద‌న్నారు. ఎందుకంటే ఆ సమయంలో క్రికెట్ చాలా తక్కువగా…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *