సర్వ దర్శనం , రూ. 300 ప్రత్యేక దర్శనం టోకెన్లు
తిరుమల : తిరుమల తిరుపతి దేవస్తానం పాలక మండలి (టీటీడీ) కీలక ప్రకటన చేసింది. భక్తుల దర్శనానికి సంబంధించి పలు సూచనలు చేశారు ముఖ్య కార్య నిర్వహణ అధికారి ముద్దాడ రవిచంద్ర, చైర్మన్ బీఆర్ నాయుడు. ఇదిలా ఉండగా స్లాటెడ్ సర్వ దర్శనం టోకెన్లు, రూ.300 ప్రత్యేక దర్శనం టికెట్లు కలిగిన భక్తులను వారికి కేటాయించిన స్లాట్ ప్రకారం నిర్దేశిత సమయంలోనే అనుమతించడం జరుగుతుందని స్పష్టం చేశారు.
ఈ నిబంధనను ఈ వారం నుంచే టీటీడీ కఠినంగా అమలు చేస్తోందని చెప్పారు. భక్తులు తమకు కేటాయించిన సమయానికంటే ముందుగా వచ్చి ఇబ్బంది పడవద్దని సూచించారు . అలాగే సమయం పాటించే భక్తులను ఇబ్బంది పెట్టవద్దని కోరారు. భక్తులందరికీ సౌకర్య వంతమైన, ముందస్తుగ దర్శనం కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. కాగా పాలకమండలి తీసుకున్న ఈ నిర్ణయాన్ని దృష్టిలో ఉంచుకుని తమకు కేటాయించిన సమయానికే క్యూలైన్ల వద్దకు చేరుకోవాలని కోరారు ఈవో.






