సంచలన వ్యాఖ్యలు చేసిన క్రికెటర్ జోస్ బట్లర్
గుజరాత్ : ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు ప్రముఖ వరల్డ్ క్లాస్ ప్లేయర్ , ఇంగ్లండ్ కు చెందిన జోస్ బట్లర్ . మార్చి 28 నుంచి ప్రపంచంలోనే అత్యంత జనాదరణ పొందింది ఈ మెగా టోర్నమెంట్. ఇందులో మొత్తం 10 జట్లు ఆడతాయి. గత కొన్నేళ్లుగా రాజస్థాన్ రాయల్స్ తరపున ఆడాడు. ఇక్కడ కీ రోల్ పోషించిన కెప్టెన్ సంజు శాంసన్ సైతం వెళ్లి పోయాడు. తను ప్రస్తుతం సీఎస్కే తరపున ఆడబోతున్నాయి. ఈ తరుణంలో ప్రారంభం కాబోయే ఐపీఎల్ సెషన్ గురించి తన మనసులో మాటలను బయట పెట్టాడు జోస్ బట్లర్. తను మీడియాతో మాట్లాడుతూ ఐపీఎల్ గురించి ఎంత చెప్పినా తక్కువేనని పేర్కొన్నాడు.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) ప్రపంచంలోనే అత్యంత పెద్ద లీగ్ అని ప్రశంసలు కురిపించాడు. దీనిని నేను ఎంతగా ప్రేమిస్తున్నానో మాటల్లో వర్ణించలేనని చెప్పాడు జోస్ బట్లర్. ఇక్కడ మీకు 7-స్టార్ హోటల్ స్థాయి సౌకర్యాలు, మీరు ఎక్కడికి వెళ్లాలనుకున్నా డ్రైవర్తో కూడిన కారు, అలాగే గుజరాత్ టైటాన్స్ జట్టులో మాకు అన్నీ సమకూరుస్తోందని చెప్పాడు. ప్రపంచ స్థాయి ప్రాక్టీస్ సదుపాయాలు లభిస్తాయని తెలిపాడు. నిజం చెప్పాలంటే, మరే ఇతర లీగ్ను కూడా IPLతో పోల్చ లేమన్నాడు జోస్ బట్లర్.






