మా జైత్ర‌యాత్ర కొన‌సాగుతుంది

Spread the love

షాకింగ్ కామెంట్స్ చేసిన పాటిదార్

బెంగళూరు : రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు జ‌ట్టు కెప్టెన్ ర‌జిత్ పాటిదార్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశాడు. ఐపీఎల్ 2026 లో భాగంగా తొలి మ్యాచ్ చిన్న‌స్వామి స్టేడియం వేదిక‌గా జ‌రిగింది. త‌ను టాస్ గెలిచి ముందుగా స‌న్ రైజ‌ర్స్ హైద‌రాబాద్ కు బ్యాటింగ్ ఇచ్చాడు. ఆ జ‌ట్టు నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 9 వికెట్లు కోల్పోయి 201 ర‌న్స్ చేసింది. ఆ టీం కెప్టెన్ ఇషాన్ కిష‌న్ ఒక్క‌డే స‌త్తా చాటాడు. మిగ‌తా వాళ్లంతా తేలి పోయారు. అనంత‌రం మైదానంలోకి దిగిన ఆర్సీబీ ఎలాంటి ఒడిదుడుకుల‌కు లోను కాకుండానే ప‌ని పూర్తి కానిచ్చేసింది.

స్టార్ ప్లేయ‌ర్ విరాట్ కోహ్లీ తో పాటు దేవ‌ద‌త్ ప‌డిక్క‌ల్ అద్భుత‌మైన ఆట తీరుతో ఆక‌ట్టుకున్నారు. దీంతో నిర్దేశించిన ఎస్ఆర్ హెచ్ ల‌క్ష్యాన్ని కేవ‌లం 15.4 ఓవ‌ర్ల‌లోనే పూర్తి చేసింది ఆర్సీబీ. అద్బుత‌మైన బౌలింగ్ తో ఆక‌ట్టుకున్న డ‌ఫీకి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు ద‌క్కింది. దీంతో బెంగళూరు తొలి మ్యాచ్ లో బోణీ కొట్టింది. ఆర్సీబీ గ‌త ఏడాది ఐపీఎల్ 2025 సీజ‌న్ విజేత‌గా నిలిచింది. మ్యాచ్ గెలుపొందాక కెప్టెన్ ర‌జత్ పాటిదార్ మీడియాతో మాట్లాడాడు. తాము మ‌రోసారి ఛాంపియ‌న్ గా నిల‌వాల‌ని కోరుకుంటున్నామ‌ని, ఆ దిశ‌గానే తాము ఆడ‌తామ‌ని చెప్పాడు.

  • Related Posts

    ఇషాన్ కిష‌న్ కెప్టెన్సీ ఇన్నింగ్స్

    Spread the love

    Spread the love6 వికెట్ల తేడాతో ఎస్ఆర్ హెచ్ ఓట‌మి బెంగ‌ళూరు : ఐపీఎల్ 19వ సీజ‌న్ లో భాగంగా బెంగ‌ళూరు వేదిక‌గా జ‌రిగిన తొలి మ్యాచ్ లో డిఫెండింగ్ చాంపియ‌న్ రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు స‌త్తా చాటింది. ప్ర‌త్య‌ర్థి స‌న్…

    ఆర్సీబీ గెలిచేనా ఎస్‌ఆర్‌హెచ్ నిలిచేనా

    Spread the love

    Spread the loveఐపీఎల్ 2026 మెగా టోర్న‌మెంట్ స్టార్ట్ బెంగ‌ళూరు : అస‌లైన మ‌జా ఏమిటో ఐపీఎల్ 2026 చూపించేందుకు సిద్ద‌మైంది. మార్చి 28న శ‌నివారం బెంగ‌ళూరులోని చిన్న‌స్వామి వేదిక కీల‌క‌మైన మ్యాచ్ కు వేదిక కానుంది. డిఫెండింగ్ ఛాంపియ‌న్ రాయ‌ల్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *