పంజాబ్ చేతిలో ఓటమిపై రుతురాజ్ గైక్వాడ్
చెన్నై : ఐపీఎల్ 2026లో రుతురాజ్ గైక్వాడ్ సారథ్యంలోని చెన్నై సూపర్ కింగ్స్ ఆశించిన మేర రాణించడం లేదు. తొలి మ్యాచ్ లో రాజస్తాన్ రాయల్స్ చేతిలో ఓటమి పాలైంది. అనంతరం రెండో మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్ ఎలెవన్ చేతిలో పరాజయం పొందింది. ప్రధానంగా భారీ ధరకు కొనుగోలు చేసిన సంజూ శాంసన్ ఆశించిన మేర రాణించలేదు. తన పూర్ పర్ ఫార్మెన్స్ జట్టుపై పడుతోంది. ఈ తరుణంలో పంజాబ్ చేతిలో ఓటమి అనంతరం సీఎస్కే కెప్టెన్ కీలక వ్యాఖ్యలు చేశారు.
తను మీడియాతో మాట్లాడారు. గత రెండు మ్యాచ్లలో మేము అస్సలు బాగా ఆడలేదని ఒప్పుకున్నాడు. చాలా పేలవమైన క్రికెట్ ఆడామన్నాడు. నిజాయితీగా చెప్పాలంటే, ఈ ఓటమి మాకు ఎంతో అవమానకరమైనది అని పేర్కొన్నాడు. ఒక జట్టుగా, తదుపరి మ్యాచ్ నుండే మేము తప్పక పుంజు కోవాల్సిన అవసరం ఉందన్నాడు రుతురాజ్ గైక్వాడ్. జట్టులో సమన్వయం కొరవడిందని వస్తున్న విమర్శలను కొట్టి పారేశాడు. ఎంఎస్ ధోనీ సారథ్యంలోని జట్టు బలంగా ఉందన్నాడు.







