జ‌న‌సేన ఎమ్మెల్యేపై ఈసీ విచార‌ణ‌కు ఆదేశం

Spread the love

పార్టీ చీఫ్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ కు కోలుకోలేని షాక్

అమ‌రావ‌తి : ఏపీ డిప్యూటీ సీఎం , జ‌న‌సేన పార్టీ అధ్య‌క్షుడు ప‌వ‌న్ క‌ళ్యాణ్ కొణిద‌ల‌కు కోలుకోలేని షాక్ ఇచ్చింది కేంద్ర ఎన్నిక‌ల సంఘం. ఈ మేర‌కు త‌మ పార్టీకి చెందిన ఎమ్మెల్యే లోకం నాగ మాధ‌వి వ్య‌వ‌హారం సంచ‌ల‌నంగా మారింది. త‌న‌పై తీవ్ర ఆరోప‌ణ‌లు వ‌చ్చాయి. ఇందులో భాగంగా ఎమ్మెల్యేపై సీరియ‌స్ అయ్యింది ఈసీ. విచార‌ణ చేయాల‌ని ఆదేశించింది. మిరకల్ సాఫ్ట్‌వేర్ మాజీ ఉద్యోగి ఆనంద్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ఈ నిర్ణ‌యం తీసుకుంది. ఈమేర‌కు జిల్లా క‌లెక్ట‌ర్ వెంట‌నే విచార‌ణ చేప‌ట్టాల‌ని స్ప‌ష్టం చేసింది.

స‌ద‌రు సాఫ్ట్ వేర్ కంపెనీలో ప‌ని చేస్తున్న 300 మంది ఉద్యోగుల ఖాతాల్లోకి అదనపు నగదు జమ కావ‌డం, తిరిగి ఆ నగదును వెనక్కి తీసుకుని ఎన్నికల ఖర్చుకు వినియోగం చేసిన‌ట్లు ఆరోపించారు బాధితుడు ఫిర్యాదులో. ‘వేతనాల రౌండ్ ట్రిప్పింగ్’ ద్వారా అక్రమాలకు పాల్పడ్డారని పేర్కొన్నారు. దీనిపై సమగ్ర నివేదిక ఇవ్వాలని విజయనగరం కలెక్టర్‌ను ఆదేశించింది ఎన్నికల సంఘం. ఇదిలా ఉండ‌గా విచార‌ణ‌కు ఆదేశించ‌డం జ‌న‌సేన పార్తీలో క‌ల‌క‌లం రేపింది. దీనిపై మాట్లాడేందుకు అన్న‌ద‌మ్ములు ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, నాగ‌బాబులు ఇంకా స్పందించ లేదు.

  • Related Posts

    సైబ‌ర్ నేరాల‌పై నియంత్ర‌ణ అవ‌స‌రం

    Spread the love

    Spread the loveయాక్ష‌న్ ప్లాన్ త‌యారు చేయాల‌న్న సీఎం అమ‌రావ‌తి : ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. రాష్ట్రంలో సైబ‌ర్ నేరాల నియంత్ర‌ణ‌కు త‌క్ష‌ణ‌మే యాక్ష‌న్ ప్లాన్ త‌యారు చేయాల‌ని ఆదేశించారు. స‌చివాల‌యంలో సైబ‌ర్ ఫ్రాడ్…

    రైతుల ధాన్యానికి ఏపీ స‌ర్కార్ భ‌రోసా

    Spread the love

    Spread the loveస్ప‌ష్టం చేసిన మంత్రి అచ్చెన్నాయుడు అమ‌రావ‌తి : ఏపీ కూట‌మి స‌ర్కార్ కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఈ మేర‌కు రైతుల‌కు తీపి క‌బురు చెప్పింది. రైతులు న‌ష్ట పోకుండా క‌నీస మ‌ద్ద‌తు ధ‌ర క‌ల్పించేందుకు కేంద్రం సానుకూలంగా వ్య‌వ‌హ‌రించింద‌ని…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *