ఆల‌యాల అభివృద్దికి భారీగా నిధులు

Spread the love

కీల‌క వ్యాఖ్య‌లు చేసిన సీఎం రేవంత్ రెడ్డి

జ‌య‌శంక‌ర్ భూపాల‌ప‌ల్లి జిల్లా : తెలంగాణ ముఖ్య‌మంత్రి ఎ. రేవంత్ రెడ్డి కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. రాష్ట్రంలో నిధుల కొర‌త లేద‌న్నారు. ఆల‌యాల అభివృద్దికి తాము కృషి చేస్తున్నామ‌ని చెప్పారు. ఇందులో భాగంగా
రాబోయే రోజుల‌లో గోదావ‌రి పుష్క‌రాల‌ను ఘ‌నంగా నిర్వ‌హిస్తామ‌ని తెలిపారు. ఇందు కోసం పెద్ద ఎత్తున నిధుల‌ను కేటాయించామ‌న్నారు. తాజాగా కాళేశ్వరంలో 198 కోట్ల రూపాయలతో శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర దేవాలయం పునరాభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు సీఎం.

అంతకు ముందు స్వామి వారిని దర్శించుకుని, పూజలు నిర్వహించి, పండితుల ఆశీర్వచనం తీసుకున్నారు. ఆలయ పనులతో పాటు కాళేశ్వరం బస్ స్టేషన్ కు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ఎంపీ గడ్డం వంశీకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

  • Related Posts

    త‌మిళ‌నాట ఇండియా కూట‌మిదే హ‌వా

    Spread the love

    Spread the loveధీమా వ్య‌క్తం చేసిన డిప్యూటీ సీఎం త‌మిళ‌నాడు : త‌మిళ‌నాడులో ఎన్నిక‌ల ప్ర‌చారం ఊపందుకుంది. ఇంకా కేవ‌లం 48 గంట‌ల స‌మ‌యం మాత్ర‌మే ఉంది ఎన్నిక‌ల పోలింగ్ చేప‌ట్టేందుకు. ఈ సంద‌ర్బంగా జ‌రిగిన ఎన్నిక‌ల ప్ర‌చారంలో నువ్వా నేనా…

    లౌకిక వాదానికి నియంతృత్వానికి మ‌ధ్య పోటీ

    Spread the love

    Spread the loveనిప్పులు చెరిగిన ఏఐసీసీ జీఎస్ కేసీ వేణుగోపాల్ త‌మిళ‌నాడు : ఏఐసీసీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి కేసీ వేణుగోపాల్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. త‌మిళ‌నాడులో ఈనెల 23న ఎన్నిక‌ల పోలింగ్ జ‌ర‌గ‌నుంది. ఈ సంద‌ర్బంగా జ‌రిగిన ఎన్నిక‌ల ప్ర‌చారంలో ఇండియా…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *