రూ. 200 కోట్లతో అమరావతిలో క్యాంపస్ నిర్మాణం
అమరావతి : భారత దేశంలో విద్యా పరంగా నెంబర్ వన్ స్థానంలో ఉంది బిట్స్ పిలానీ క్యాంపస్, యూనివర్శిటీ. ఈ సందర్బంగా ఏపీ రాజధాని అమరావతి వేదికగా బిట్స్ పిలానీ క్యాంపస్ ను నిర్మించనుంది. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వంతో సీఎం నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో అవగాహన ఒప్పందం చేసుకుంది. ఈ సందర్బంగా భారీ ఎత్తున ఖర్చు చేస్తోంది. యుద్ద ప్రాతిపదికన నిర్మాణం పనులు చేపడుతోంది. పనుల ప్రగతికి సంబంధించి బిట్స్ పిలానీ ప్రతినిధులు ఇవాళ ఏపీ సీఎం తో ప్రత్యేకంగా భేటీ అయ్యారు రాష్ట్ర సచివాలయంలోని సీఎం క్యాంపు ఆఫీసులో.
రాజధాని అమరావతి ప్రాతంలో రూ.250 కోట్ల వ్యయంతో నిర్మితం అవుతున్న బిట్స్ పిలాని క్యాంపస్ పురోగతిని వారు వివరించారు సీఎంకు. 2027 నుంచి అడ్మిషన్లు ప్రారంభించే ఈ క్యాంపస్ లో క్వాంటం, ఏఐ విభాగాలు కూడా ఉంటాయని చెప్పారు. మూడు దశల్లో నిర్మాణమయ్యే ఈ క్యాంపస్ లో మొత్తం 10 వేల మంది విద్యార్ధులు చదువుకునే వీలు కలుగుతుందని వెల్లడించారు బిల్స్ పిలానీ ప్రతినిధులు సీఎం నారా చంద్రబాబు నాయుడుకు. ప్రభుత్వం అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తుందని స్పష్టం చేశారు ప్రతినిధులకు.





