విజ‌య‌వాడ ఉత్స‌వం ఏపీకి గ‌ర్వ‌కార‌ణం

ఏపీ స్పీక‌ర్ చింత‌కాయ‌ల అయ్య‌న్న‌పాత్రుడు

అమరావతి : విజయవాడ ఉత్సవ్ ద్వారా ఆంధ్రప్రదేశ్ సాంస్కృతిక వైభవం దేశ వ్యాప్తంగా ప్రతిధ్వనిస్తుందని స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు అన్నారు. ఆంధ్రప్రదేశ్ టూరిజం ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో జరుగుతున్న ఈ మహోత్సవం ప్రపంచంలోనే అతి పెద్ద పండుగ కార్నివల్‌గా నిలుస్తుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.

స్పీకర్ కార్యాలయంలో సోమ‌వారం శాసన సభ్యులు బోండా ఉమా , గద్దే రామ్మోహన్ , బోడె ప్రసాద్ మర్యాద పూర్వకంగా స్పీక‌ర్ చింత‌కాయ‌ల అయ్య‌న్న పాత్రుడును కలిశారు. విజయవాడ ఉత్సవానికి రావాల్సిందిగా ప్ర‌త్యేకంగా ఆహ్వానం అందజేశారు. ఈ సందర్భంగా స్పీకర్ మాట్లాడారు. సెప్టెంబర్ 22 నుండి అక్టోబర్ 2 వరకు పున్నమి ఘాట్, తుమ్మలపల్లి కళాక్షేత్రం, ఎంజీ రోడ్, ఘంటసాల సంగీత కళాశాల, విజయవాడ ఎక్స్పో వేదికలపై జరిగే ఈ ఉత్సవం విజయవాడ సాంస్కృతిక గౌరవాన్ని మరింతగా పెంచుతుందని ఆశా భావం వ్య‌క్తం చేశారు.

ఇంద్ర‌కీలాద్రి కొండ‌పై కొలువు తీరిన శ్రీ‌క‌న‌క దుర్గ‌మ్మ అమ్మ రి దసరా శోభాయాత్రల నడుమ జరుగుతున్న ఈ వేడుకల్లో భాగంగా ఒక్క నగరం – ఒకే ఉత్సవం అనే భావనతో నిర్వ‌హించ‌డం అభినంద‌నీయ‌మ‌ని అన్నారు అయ‌య‌న్న‌పాత్రుడు. . యువ సోంలో రాష్ట్ర ప్రజలందరూ పాల్గొని ఉత్సవాలను జయప్రదం చేయాలని కోరారు. దేవి కనకదుర్గ అమ్మవారి దివ్య ఆశీస్సులు ఎల్లప్పుడూ ప్రజలపై ఉండాలని అయ్య‌న్న పాత్రుడు ఆకాంక్షించారు.

  • Related Posts

    స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల్లో స‌త్తా చాటుతాం

    ధీమా వ్య‌క్తం చేసిన ఎంపీ ఈట‌ల రాజేంద‌ర్ క‌రీంన‌గ‌ర్ జిల్లా : రాష్ట్రంలో త్వ‌ర‌లో జ‌ర‌గ‌బోయే స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల్లో మెజారిటీ స్థానాలు సాధించి తీరుతామ‌ని ధీమా వ్య‌క్తం చేశారు బీజేపీ ఎంపీ ఈటల రాజేంద‌ర్. క‌రీనంగ‌ర్ జిల్లాలో ఆయ‌న ప‌ర్య‌టించారు.…

    ప్రాథమిక వ్యవసాయ రంగంలో ఏపీ నెంబ‌ర్ వ‌న్

    ప్ర‌క‌టించిన మంత్రి కింజ‌రాపు అచ్చెన్నాయుడు అమ‌రావ‌తి : ఏపీ వ్య‌వ‌సాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. ప్రాథ‌మిక వ్య‌వ‌సాయ రంగంలో ఏపీ టాప్ లో ఉంద‌న్నారు. ఈ 17 నెలల కాలంలో సూపర్ సిక్స్ పథకాలను పూర్తిగా నెరవేరుస్తూ…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *