సంచలన వ్యాఖ్యలు చేసిన కెప్టెన్
హైదరాబాద్ : ఐపీఎల్ 2026లో భాగంగా హైదరాబాద్ లోని ఉప్పల్ స్టేడియంలో జరిగిన కీలకమైన మ్యాచ్ లో కోల్ కతా నైట్ రైడర్స్ భారీ విజయాన్ని నమోదు చేసింది. అద్భుత విజయాలతో దూసుకు పోతున్న సన్ రైజర్స్ హైదరాబాద్ పై విక్టరీ సాధించింది. ఊహించని రీతిలో ఝలక్ ఇచ్చింది. మ్యాచ్ అనంతరం కోల్ కతా నైట్ రైడర్స్ కెప్టెన్ అజింక్యా రహానే స్పందించాడు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడాడు. వరుసగా మూడు మ్యాచ్లలో విజయం సాధించడం నిజంగా చాలా గొప్పగా అనిపిస్తోందని చెప్పాడు. నేటి మ్యాచ్లో, పవర్ప్లే తర్వాత మా బౌలర్లు ప్రదర్శించిన తీరు నిజంగా అద్భుతం అన్నాడు.
ముఖ్యంగా మిడిల్ ఓవర్లలో అద్భుతమైన బౌలింగ్ చేసిన వరుణ్ చక్రవర్తి , సునీల్ నరైన్లకు నేను ప్రత్యేకంగా ఘనతను ఆపాదిస్తున్నానని చెప్పాడు అజింక్యా రహానే. బ్యాటింగ్ విషయానికి వస్తే, ఫిన్ అలెన్ మాకు ఒక అద్భుతమైన ఆరంభాన్ని అందించాడని తెలిపాడు. అంగక్రిష్ రఘువంశీ, రింకూ సింగ్ కూడా ఈ రోజు చాలా బాగా బ్యాటింగ్ చేశారు. మేము ఇదే రీతిలో మా ఆటను కొనసాగించాలని అనుకుంటున్నాం అన్నాడు కెప్టెన్. ఈ టోర్నమెంట్లో మా ఆశలు ఇంకా సజీవంగానే ఉన్నాయని ధీమా వ్యక్తం చేశాడు. మాకు మంచి అవకాశం ఉంది, తాము అగ్రస్థానంలో నిలుస్తామనే నమ్మకం ఉందన్నాడు రహానే.





