ఉర్విల్ ప‌టేల్ ఇన్సింగ్స్ అద్భుతం

ప్ర‌శంసలు కురిపించిన సంజు సాంస‌న్

చెన్నై : చెన్నై వేదిక‌గా జ‌రిగిన తాజా కీల‌క లీగ్ మ్యాచ్ లో చెన్నై సూప‌ర్ కింగ్స్ 5 వికెట్ల తేడాతో రిష‌బ్ పంత్ సార‌థ్యంలోని ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ ను మ‌ట్టిక‌రిపించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన ఆ జ‌ట్టు నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 203 ర‌న్స్ చేసింది. అనంత‌రం మైదానంలోకి దిగిన సీఎఎస్కే ఊహించ‌ని రీతిలో 19.2 బంతుల్లోనే టార్గెట్ ను పూర్తి చేసింది. ప్ర‌ధానంగా చెప్పు కోవాల్సింది గుజ‌రాత్ రాష్ట్రానికి చెందిన ఉర్విల్ ప‌టేల్ ఆకాశ‌మే హ‌ద్దుగా చెల‌రేగాడు. ల‌క్నో బౌల‌ర్ల‌ను ఉతికి ఆరేశాడు. ఒకానొక ద‌శ‌లో ఏమీ చేయాలో పాలుపోక నిశ్చేష్టంగా ఉండి పోయారు. త‌ను కేవ‌లం 13 బంతుల్లో హాఫ్ సెంచీర చేశాడు. ఇక 23 బంతులు ఎదుర్కొని 2 ఫోర్లు 8 భారీ సిక్స‌ర్ల‌తో 65 ర‌న్స్ చేసి రికార్డు సృష్టించాడు.

ఈ సంద‌ర్బంగా ఉర్విల్ ప‌టేల్ ఇన్నింగ్స్ గురించి స్పందించాడు స్టార్ క్రికెట‌ర్ సంజు శాంస‌న్.
నిజం చెప్పాలంటే, ఉర్విల్ పటేల్ ఒక అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. పవర్-హిట్టింగ్ చేసే ఆటగాళ్లను నేను చాలా మందిని చూశాను, కానీ బంతిని ఈ విధంగా బాదే వారిని నేను చాలా అరుదుగా చూశాను. సిక్సర్లు బాదడంలో ఉర్విల్ పటేల్‌కు ఒక ప్రత్యేకమైన సామర్థ్యం ఉంది. అతను అత్యద్భుతంగా ఆడాడు. రాబోయే మ్యాచ్‌లలో కూడా ఉర్విల్ పటేల్ ఇదే విధంగా ఆడుతూ, జట్టుకు ఇదే రీతిలో సహాయ పడతాడని నేను ఆశిస్తున్నానని అన్నాడు సంజు శాంస‌న్.

  • Related Posts

    ఐపీఎల్ 2027లో ఎంఎస్ ధోనీ ఆడేది క‌ష్ట‌మే ..?

    చెన్నై : అంద‌రి క‌ళ్లు మ‌హేంద్ర సింగ్ ధోనీపై ఉన్నాయి. ఈ ఏడాది 2026లో జ‌రిగిన ఐపీఎల్ లో ఆశించిన మేర రాణించ‌లేదు సీఎస్కే జ‌ట్టు. నిరాశజనకమైన ప్రదర్శనతో ప్లేఆఫ్స్‌కు చేరలేక పోయింది, ఇది అభిమానులను తీవ్ర నిరాశకు గురిచేసింది. దీనికి…

    ఐపీఎల్ సరైన సమయంలో జరగడం లేదు

    ఇంగ్లండ్ : ఐపీఎల్ మాజీ చైర్మ‌న్ ల‌లిత్ మోడీ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. భార‌త దేశంలో తొలిసారిగా ఇండియ‌న్ ప్రిమీయ‌ర్ లీగ్ ను ప్రారంభించినప్పుడు ఏప్రిల్-మే నెలల విండోను ఎవరూ కోరుకో లేద‌న్నారు. ఎందుకంటే ఆ సమయంలో క్రికెట్ చాలా తక్కువగా…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *