మే 18న కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం

Spread the love

ప్ర‌క‌టించిన తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం

తిరుప‌తి : శ్రీ గోవింద రాజ స్వామి వారి వార్షిక బ్ర‌హ్మోత్స‌వాలు ఈనెల 23 నుండి ప్రారంభం కానున్నాయి.
బ్రహ్మోత్సవాల సందర్భంగా మే 18వ తేదీన ఆలయంలో కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం నిర్వహించనున్నారు. తెల్లవారుజామున సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి తోమాలసేవ, కొలువు, పంచాంగశ్రవణం నిర్వహిస్తారు. అనంతరం ఉదయం 7 నుండి 9 గంటల వరకు ఆలయ శుద్ధి కార్యక్రమమైన కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం జరుగనుంది.

ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణం, గోడలు, పైకప్పు, పూజాసామగ్రి తదితరాలను పవిత్రజలాలతో శుద్ధి చేసి, నామకోపు, శ్రీచూర్ణం, కస్తూరి, పసుపు, పచ్చాకు, గడ్డకర్పూరం, గంధం, కుంకుమ తదితర సుగంధ ద్రవ్యాలతో తయారు చేసిన పవిత్ర మిశ్రమాన్ని ఆలయం అంతటా ప్రోక్షణం చేస్తారు. అనంతరం భక్తులను సర్వదర్శనానికి అనుమతిస్తారు. ఉత్స‌వాల‌ను పుర‌స్క‌రించుకుని తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్తానం పాల‌క మండ‌లి భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తోంది.

  • Related Posts

    శ్రీవారి సేవకులకు భద్రతా అంశాలపై అవగాహన

    Spread the love

    Spread the loveరహదారి భద్రత, డ్రగ్స్ నివారణ, సైబర్ నేరాలు తిరుమ‌ల‌ : తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు ఆదేశాల మేరకు తిరుమలలోని సేవాసదన్‌లో మహిళల భద్రతపై తిరుమల సబ్ డివిజన్ పోలీసులు ప్రత్యేక అవగాహన సమావేశం నిర్వహించారు ఈ…

    టిటిడి జూనియర్ కళాశాల‌ల్లో ప్రవేశాలకు ఆహ్వానం

    Spread the love

    Spread the loveవిద్యార్థుల‌కు ఉచితంగా మెరుగైన వ‌స‌తి సౌక‌ర్యాలు తిరుపతి : టిటిడి తిరుపతిలో నిర్వహిస్తున్న శ్రీ పద్మావతి మహిళా జూనియర్ కళాశాల, శ్రీ వేంకటేశ్వర జూనియర్ కళాశాల‌ల్లో 2026 -27 విద్యా సంవత్సరానికి గాను అర్హులైన విద్యార్థుల నుండి ఆన్‌లైన్‌లో…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *