పోక్సో కేసులో నోటీసులు పంపించిన పోలీసులు
హైదరాబాద్ : దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది కేంద్ర మంత్రి బండి సంజయ్ కొడుకు బండి భగీరథ్ పోక్సో కేసు. ఈ కేసులో దర్యాప్తుపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. మరో వైపు బండి బగీరథ్ మధ్యంతర బెయిల్ ఇవ్వాలని అభ్యర్థిస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈనెల 14న విచారణకు రానుంది హైకోర్టులో. ప్రస్తుతం వరుస సెలవులు ఉన్నాయి. ఇదిలా ఉండగా ఈనెల 8వ తేదిన కరీంనగర్ లో భగీరథ్ పోలీస్ స్టేషన్ లో బాలికపై.. ఆమె తల్లిదండ్రులపై కరీంనగర్ టూ టౌన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.
అదే రోజు సైబరాబాద్ కమిషనర్ పరిధిలోని పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ లో ( తాము నివసించే పరిధి) బండి భగీరథ్ సహా మాజీ జర్నలిస్ట్.. బీజేపీ నేత సంగప్ప పై బాలిక తరుపున ఆమె తల్లి ఫిర్యాదు చేశారు. పోక్సో చట్టం ప్రకారం కేసు నమోదు చేయాలని ఫిర్యాదు చేయగా ఆధారాలు పరిశీలించిన పోలీసులు.. అదే చట్టం ప్రకారం భగీరథ్ పై కేసు నమోదు చేశారు. నిన్న ముఖ్యమంత్రి ఆదేశాలతో డీజీపీ ఈ కేసుపై ప్రత్యేక దృష్టి పెట్టారు.. దర్యాప్తు పర్యవేక్షణ బాధ్యతలు కూకట్ పల్లి డీసీపీ రితిరాజ్ కు అప్పగించారు.. దీంతో ఈ కేసులో విచారణ వేగవంతమైంది.





