బండి భ‌గీర‌థ్ బెయిల్ దావాపై హైకోర్టు విచార‌ణ

పోక్సో కేసులో నోటీసులు పంపించిన పోలీసులు

హైద‌రాబాద్ : దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది కేంద్ర మంత్రి బండి సంజ‌య్ కొడుకు బండి భ‌గీర‌థ్ పోక్సో కేసు. ఈ కేసులో దర్యాప్తుపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. మరో వైపు బండి బగీరథ్ మధ్యంతర బెయిల్ ఇవ్వాలని అభ్యర్థిస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈనెల 14న విచార‌ణ‌కు రానుంది హైకోర్టులో. ప్ర‌స్తుతం వ‌రుస సెలవులు ఉన్నాయి. ఇదిలా ఉండ‌గా ఈనెల 8వ తేదిన కరీంనగర్ లో భగీరథ్ పోలీస్ స్టేషన్ లో బాలికపై.. ఆమె తల్లిదండ్రులపై కరీంనగర్ టూ టౌన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.

అదే రోజు సైబరాబాద్ కమిషనర్ పరిధిలోని పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ లో ( తాము నివసించే పరిధి) బండి భగీరథ్ సహా మాజీ జర్నలిస్ట్.. బీజేపీ నేత సంగప్ప పై బాలిక తరుపున ఆమె తల్లి ఫిర్యాదు చేశారు. పోక్సో చట్టం ప్రకారం కేసు నమోదు చేయాలని ఫిర్యాదు చేయగా ఆధారాలు పరిశీలించిన పోలీసులు.. అదే చట్టం ప్రకారం భగీరథ్ పై కేసు నమోదు చేశారు. నిన్న ముఖ్యమంత్రి ఆదేశాలతో డీజీపీ ఈ కేసుపై ప్రత్యేక దృష్టి పెట్టారు.. దర్యాప్తు పర్యవేక్షణ బాధ్యతలు కూకట్ పల్లి డీసీపీ రితిరాజ్ కు అప్పగించారు.. దీంతో ఈ కేసులో విచారణ వేగవంతమైంది.

  • Related Posts

    రాబోయే భ‌విష్య‌త్తును నిర్దేశించేది ఏఐనే

    చెన్నై : : ‘దేశమే ప్రథమం’ అనే సూత్రానికి కట్టుబడి, తమ జ్ఞానం, ఆవిష్కరణలు , నైపుణ్యాలను దేశ నిర్మాణానికి వినియోగించాలని ఉప రాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్ పట్టభద్రులను కోరారు. చెన్నై సమీపంలోని కట్టంకుళత్తూరులో ఉన్న ఎస్.ఆర్.ఎం. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్…

    తెలంగాణ ‘సేఫ్’ డైర‌క్ట‌ర్ గా అవినాష్ మొహంతి

    హైద‌రాబాద్ : తెలంగాణ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఇప్ప‌టికే స‌మ‌ర్థ‌వంత‌మైన పోలీస్ ఆఫీస‌ర్ గా గుర్తింపు పొందారు అవినాష్ మొహంతి. ఆయ‌న‌కు కీల‌క ప‌ద‌వి క‌ట్ట‌బెట్టింది . సేఫ్ డైరెక్ట‌ర్ గా నియ‌మించింది. గతంలో తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *