మావిగన్ అంటే జనం జడుసుకుంటున్నారు
అమరావతి : మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేశారు రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. జగన్ రెడ్డి ఒక పిచ్చి తుగ్లక్ అని ఫైర్ అయ్యారు. జగన్ మావిగన్ అంటే కూటమి భయపడటం లేదన్నారు. ప్రజలే జంకుతున్నారని పేర్కొన్నారు. అధికారం కోసం జగన్ ఎంతకైనా తెగిస్తాడని అన్నారు. హత్యా రాజకీయాలు చేయడం తనకు అలవాటుగా మారిందన్నారు. ఆపై తమపై బురద జల్లడం విడ్డూరంగా ఉందన్నారు నిమ్మల రామానాయుడు.
అమరావతి లో జరుగుతున్న పనులు చూసి జగన్ కి భయం మొదలైందన్నారు. అందుకే అమరావతి పై జగన్ విషం కక్కుతున్నాడని మండిపడ్డారు. జగన్ మళ్ళీ సీఎం అయితే పొట్టేలు తలల స్థానంలో ప్రజల తలలు నరుకుతాడని ఆరోపించారు. వచ్చే ఎన్నికల్లో జగన్ కి 11 సీట్లు కుడా రావు అని జోష్యం చెప్పారు. ఇదిలా ఉండగా రెండో వారం నో వెహికల్ డే సందర్భంగా పాలకొల్లు నుండి ట్రైన్ లో సాధారణ ప్రయాణికులతో కలసి విజయవాడ చేరుకున్నారు మంత్రి నిమ్మల రామానాయుడు. రామవరప్పాడు రైల్వే స్టేషన్ నుండి మంగళగిరి పార్టీ కేంద్ర కార్యాలయం వరకు సైకిల్ తొక్కాడు.





