టీమిండియా అదుర్స్ శాంస‌న్ సూప‌ర్

Spread the love

ప్ర‌శంస‌లు కురిపించిన స‌చిన్ టెండూల్క‌ర్

ముంబై : సూర్య కుమార్ యాద‌వ్ సార‌థ్యంలోని భార‌త జ‌ట్టు మ‌రో అడుగు దూరంలో ఉంది చ‌రిత్ర సృష్టించేందుకు . ఈనెల 8న అహ్మ‌దాబాద్ వేదిక‌గా కీవీస్ తో ఫైన‌ల్ మ్యాచ్ ఆడ‌నుంది. ఇక కీల‌క‌మైన , అత్యంత ముఖ్య‌మైన సెమీ ఫైన‌ల్ మ్యాచ్ మాత్రం ఉత్కంఠ‌ను రేపింది. కోట్లాది అభిమానుల‌ను కంటి మీద కునుకు లేకుండా చేసింది. ప్ర‌పంచ వ్యాప్తంగా ఈ మ్యాచ్ ను అత్య‌ధికంగా వీక్షించిన‌ట్లు స‌మాచారం. ఇండియా ఫైన‌ల్ కు చేరుకోవ‌డంతో దేశ వ్యాప్తంగా సంబురాలు మిన్నంటాయి. రాజ‌కీయ‌, సినీ, వ్యాపార‌, వాణిజ్య త‌దిత‌ర రంగాల‌కు చెందిన ప్ర‌ముఖులు భార‌త జ‌ట్టు సాధించిన విజ‌యాన్ని, ప్రత్యేకించి సంజూ శాంస‌న్ ఆడిన ఆట తీరు గురించి ప్ర‌శంస‌లు కురిపిస్తున్నారు.

ఇందులో భాగంగా భార‌త జ‌ట్టు మాజీ కెప్టెన్ స‌చిన్ ర‌మేష్ టెండూల్క‌ర్ స్పందించాడు. అద్భుత విజ‌యాన్ని న‌మోదు చేసినందుకు ఆనందంగా ఉంద‌న్నాడు. ఇది మ‌రిచి పోలేని మ్యాచ్ అంటూ పేర్కొన్నాడు. మాజీ క్రికెట‌ర్లు సైతం శాంస‌న్ ను ఆకాశానికి ఎత్తేశారు. త‌ను కేవ‌లం 42 బంతులు మాత్ర‌మే ఆడాడు. 8 ఫోర్లు 7 సిక్సులతో 89 ప‌రుగులు చేశాడు. దీంతో ఇండియా నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 7 వికెట్లు కోల్పోయి 253 ప‌రుగుల భారీ స్కోర్ సాధించింది. మ‌రో వైపు ఇంగ్లండ్ సైతం అదే స్థాయిలో పోరాడింది. 7 ప‌రుగుల తేడాతో ఓట‌మి పాలైంది. మొత్తంగా స‌మిష్టి కృషితో గ్రాండ్ విక్ట‌రీని న‌మోదు చేసింది.

  • Related Posts

    సంజు శాంస‌న్ చెన్నై సూప‌ర్ కింగ్స్ కు బ‌లం

    Spread the love

    Spread the loveకీల‌క వ్యాఖ్య‌లు చేసిన మాజీ క్రికెట‌ర్ జ‌హీర్ ఖాన్ ముంబై : కేర‌ళ స్టార్ క్రికెట‌ర్ సంజు శాంస‌న్ గురించి కీల‌క వ్యాఖ్య‌లు చేశారు భార‌త జ‌ట్టు మాజీ క్రికెట‌ర్, అన‌లిస్ట్ జ‌హీర్ ఖాన్. ఇవాళ ఆయ‌న మీడియాతో…

    డికాక్ స‌త్తా చాటినా గ‌ట్టెక్క‌ని ముంబై ఇండియ‌న్స్

    Spread the love

    Spread the love60 బంతులు 112 ర‌న్స్ 8 ఫోర్లు 7 సిక్స‌ర్లు ముంబై : ఐపీఎల్ 2026లో శ్రేయ‌స్ అయ్య‌ర్ సార‌థ్యంలోని పంజాబ్ కింగ్స్ ఎలెవ‌న్ కంటిన్యూ విజ‌యాల‌తో దూసుకు పోతోంది. ప్ర‌త్య‌ర్థి జ‌ట్ల‌కు చుక్క‌లు చూపిస్తోంది. అటు బ్యాటింగ్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *