జ‌గ‌న్ విదేశీ ప‌ర్య‌ట‌న‌కు లైన్ క్లియ‌ర్

VijayaBhaskar · April 17, 2026
Spread the love

కొన్ని ష‌ర‌తులు విధించిన సీబీఐ కోర్టు

హైదరాబాద్ : ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర మాజీ ముఖ్య‌మంత్రి, వైస్ఆర్సీపీ రాష్ట్ర అధ్య‌క్షుడు వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డికి భారీ ఊర‌ట ల‌భించింది. వైఎస్ జగన్ యూరప్ పర్యటనకు సీబీఐ కోర్టు అనుమతి ఇచ్చింది. కుటుంబ సభ్యులతో కలిసి యూరప్ వెళ్ళేందుకు కోర్టు అనుమతి కోరారు. ఇదిలా ఉండ‌గా ఈ నెల 20 నుంచి మే 15 వరకు విదేశీ పర్యటనకు వెళ్లాల్సి ఉంద‌ని , ఇందుకు సీబీఐ కోర్టు అనుమ‌తి ఇవ్వాల‌ని పిటిష‌న్ దాఖ‌లు చేశారు. దేశం విడిచి వెళ్లేముందు ఫోన్ నెంబర్, ఈ-మెయిల్ ఐడీ, ష్యూరిటీని సీబీఐ అధికారులకు అందజేయాలని ఈ సంద‌ర్బంగా మాజీ సీఎం వైఎస్ జగన్‌కు సీబీఐ కోర్టు ఆదేశించింది.

గ‌తంలో యూపీఐ హ‌యాంలో కొలువు తీరిన స‌మ‌యంలో అవినీతి, అక్ర‌మాల‌కు పాల్ప‌డిన‌ట్లు జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిపై ఆరోప‌ణ‌లు ఉన్నాయి. సీబీఐ కోర్టు త‌న‌పై కేసు న‌మోదు చేసింది. ఈ కేసు ఇంకా కొన‌సాగుతూనే వ‌స్తోంది. ఇదే క్ర‌మంలో త‌న‌పై న‌మోదు చేసిన కేసుల‌కు సంబంధించి స్పందించారు మాజీ సీఎం వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి. ఇదంతా కావాల‌ని త‌న‌ను బ‌ద్నాం చేసేందుకు చేసిన ప్ర‌య‌త్నం త‌ప్పా మ‌రోటి కాద‌న్నారు. రాబోయే రోజుల్లో తాను నిర్దోషిగా బ‌య‌ట ప‌డ‌తాన‌ని, త‌న‌కు ఆ న‌మ్మ‌కం ఉంద‌న్నారు జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి.