వీర‌బ్ర‌హ్మేంద్ర స్వామి మ‌ఠాధిప‌తి ద‌ర్శ‌నం

శ్రీశ్రీశ్రీ వీర ధర్మజ వెంకటాద్రి స్వామి ఆశీర్వాదం

నంద్యాల జిల్లా : ఆళ్ల‌గ‌డ్డ నియోక‌వ‌ర్గంలోని శ్రీ బ్రహ్మంగారి మఠం లో శ్రీ స్వాములవారి 333వ ఆరాధన గురుపూజ మహోత్సవాలు ఘ‌నంగా నిర్వ‌హించారు. ఉత్స‌వాల‌లో భాగంగా ఈ రోజున వైశాఖ శుద్ధ దశమి పర్వదినాన శ్రీ స్వాముల వారు సజీవ సమాధి నిష్ఠ వహించిన పవిత్ర సుదినం. జగద్గురు శ్రీమద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి మఠం 12 మఠాధిపతులు శ్రీ శ్రీ శ్రీ వీర ధర్మజ వెంకటాద్రి స్వాముల వారు సింహాసనాసీనులై అశేష భక్త జనావళికి దర్శనం ఇచ్చారు. ఈ కార్యక్రమంలో వేలాది మంది భక్తులు పాల్గొన్నారు.

ఈ సంద‌ర్బంగా మ‌ఠాధిప‌తి ఉపదేశం ఇచ్చారు. పోతులూరి వీరబ్ర‌హ్మేంద్ర స్వాముల వారు చెప్పిన కాల‌జ్ఞానం ఇప్ప‌టికీ వెలుగులు పంచుతూనే ఉంద‌న్నారు. ఆయ‌న చెప్పిన ప్ర‌తిదీ నిజమైంద‌ని అన్నారు. ప్రతి ఏటా ఆరాధ‌నా ఉత్స‌వాలు నిర్వ‌హించ‌డం ఆనవాయితీగా వ‌స్తోంద‌ని చెప్పారు శ్రీ‌శ్రీ‌శ్రీ వీర ధ‌ర్మ‌జ వెంక‌టాద్రి స్వాముల వారు. ప్ర‌భుత్వ , దేవాదాయ ధ‌ర్మాదాయ స‌హ‌కారంతో ఆల‌యంలో ప‌లు అభివృద్ది ప‌నులు చేప‌ట్ట‌డం జ‌రుగుతోంద‌ని అన్నారు.

  • Related Posts

    శ్రీ‌వారి ఉద్యోగులకు వెండి డాలర్‌, ప్రశంసా పత్రాలు

    తిరుపతి : తిరుపతి టీటీడీ పరిపాలనా భవనంలో భారత స్వాతంత్య్ర వేడుకలు ఘనంగా జరిగాయి. ఇక్కడి పరేడ్‌ మైదానంలో టీటీడీ ఛైర్మ‌న్ బీఆర్ నాయుడు జాతీయ జెండాను ఎగురవేసి వందనం చేశారు. భద్రతా సిబ్బంది నుండి గౌరవ వందనం స్వీకరించారు. ఈ…

    ఆగ‌స్టు 17 నుంచి ఆధ్యాత్మిక సేవ‌ల‌పై జాతీయ స‌ద‌స్సు

    తిరుపతి : తిరుపతిలోని అన్నమాచార్య కళా మందిరంలో టీటీడీ ఆళ్వార్ దివ్య ప్రబంధ ప్రాజెక్టు ఆధ్వర్యంలో ఆగస్టు 17 నుంచి 19వ తేదీ వరకు శ్రీ వైష్ణవ ఆచార్యుల ఆధ్యాత్మిక సేవలపై జాతీయ సదస్సు నిర్వహించనున్నారు. శ్రీ రామానుజులు, ఆచార్య పుండరీకాక్షులు,…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *