తెలుగు ప్రజలు బాగుండాలని కోరుకున్నా
విశాఖపట్నం జిల్లా : విశాఖ జిల్లా తర్లువాడలో గూగుల్ క్లౌడ్ ఏఐ హబ్ కు శంకుస్థాపన అనంతరం సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామి వారిని దర్శించుకున్నారు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, కేంద్ర మంత్రులు పెమ్మసాని చంద్రశేఖర్, కింజారపు రామ్మోహన్ నాయుడు, రాష్ట్ర హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత, ఐటీ, విద్యా శాఖ మంత్రి నారా లోకేష్, తదితరలు. ఈ సందర్బంగా ఆలయ కమిటీ చైర్మన్, వేద పండితులు ఘనంగా సాదర స్వాగతం పలికారు కేంద్ర మంత్రి, సీఎంకు.
శ్రీ లక్ష్మీ నరసింహ స్వామికి ఘనంగా పూజలు చేశారు. అంతా మంచే జరిగేలా చూడాలని ప్రార్థించానని అన్నారు సీఎం నారా చంద్రబాబు నాయుడు. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, భావితరాలకు ఉపయోగపడే ఇలాంటి ప్రాజెక్టులు మరిన్ని మన రాష్ట్రానికి రావాలని స్వామి వారిని వేడుకున్నానని తెలిపారు. మానవ ప్రయత్నానికి దేవుని ఆశీస్సులు తోడైతే అందరికీ మంచి జరుగుతుందని చెప్పారు. స్వామిని దర్శించు కోవడం మరిచి పోలేని అనుభూతిని మిగిల్చిందన్నారు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్.







