మేం మళ్లీ పుంజుకుంటామని ప్రకటన
ఐర్లాండ్ : ఐర్లాండ్ తో జరిగిన కీలక మ్యాచ్ లో అత్యంత బలమైన భారత జట్టు పేలవమైన ఆటతీరును ప్రదర్శించింది. భారీ తేడాతో ఓడి పోయింది. ఈ సందర్బంగా జట్టు కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ స్పందించాడు. ఈ మ్యాచ్లో ఓడిపోవడం నిజంగా నిరాశను కలిగిస్తోందని అన్నాడు. ఇది మాకు నిజంగా అవమానకరమైన ఓటమి అని పేర్కొన్నాడు. ఏ విషయాన్నీ తేలికగా తీసుకోకూడదని నేను భావిస్తున్నానని తెలిపాడు. ప్రతి మ్యాచ్నూ పూర్తి గంభీరతతో ఆడాలని సూచించాడు సహచర ఆటగాళ్లకు.
కేవలం మైదానంలో అడుగు పెట్టినంత మాత్రాన విజయం దక్కదన్నాడు. గెలవాలంటే కష్టపడాలి మరియు పూర్తి ఏకాగ్రతతో ఉండాలి. నేను ఇంతకు ముందే చెప్పినట్లుగా, మనం ప్రస్తుత క్షణంపై దృష్టి పెట్టాలని పేర్కొన్నాడు శ్రేయాస్ అయ్యర్. ప్రత్యర్థిని ఒత్తిడిలోకి నెట్టే అవకాశం దొరికినప్పుడల్లా, దానిని మనం పూర్తిగా సద్వినియోగం చేసుకోవాలని సూచించాడు.. ఏ ప్రత్యర్థినీ ఎప్పుడూ తక్కువ అంచనా వేయకూడదు. అలా చేస్తే, ఇలాంటి ఫలితాలే వస్తాయని కుండ బద్దలు కొట్టాడు. జట్టులోని ప్రతి ఒక్కరూ పూర్తి అంకితభావంతో, గంభీరంగా ఉండాలి. తదుపరి మ్యాచ్లో మేము పుంజుకుని విజయం సాధిస్తామని ఆశిస్తున్నానని తెలిపాడు.






