ఐర్లాండ్ తో ఓట‌మి పై అయ్య‌ర్ కామెంట్స్

Spread the love

మేం మ‌ళ్లీ పుంజుకుంటామ‌ని ప్ర‌క‌ట‌న

ఐర్లాండ్ : ఐర్లాండ్ తో జ‌రిగిన కీల‌క మ్యాచ్ లో అత్యంత బ‌ల‌మైన భార‌త జ‌ట్టు పేల‌వ‌మైన ఆట‌తీరును ప్ర‌ద‌ర్శించింది. భారీ తేడాతో ఓడి పోయింది. ఈ సంద‌ర్బంగా జ‌ట్టు కెప్టెన్ శ్రేయాస్ అయ్య‌ర్ స్పందించాడు. ఈ మ్యాచ్‌లో ఓడిపోవడం నిజంగా నిరాశను కలిగిస్తోందని అన్నాడు. ఇది మాకు నిజంగా అవమానకరమైన ఓటమి అని పేర్కొన్నాడు. ఏ విషయాన్నీ తేలికగా తీసుకోకూడదని నేను భావిస్తున్నానని తెలిపాడు. ప్రతి మ్యాచ్‌నూ పూర్తి గంభీరతతో ఆడాల‌ని సూచించాడు స‌హ‌చ‌ర ఆట‌గాళ్ల‌కు.

కేవలం మైదానంలో అడుగు పెట్టినంత మాత్రాన విజయం దక్కద‌న్నాడు. గెలవాలంటే కష్టపడాలి మరియు పూర్తి ఏకాగ్రతతో ఉండాలి. నేను ఇంతకు ముందే చెప్పినట్లుగా, మనం ప్రస్తుత క్షణంపై దృష్టి పెట్టాలని పేర్కొన్నాడు శ్రేయాస్ అయ్య‌ర్. ప్రత్యర్థిని ఒత్తిడిలోకి నెట్టే అవకాశం దొరికినప్పుడల్లా, దానిని మనం పూర్తిగా సద్వినియోగం చేసుకోవాల‌ని సూచించాడు.. ఏ ప్రత్యర్థినీ ఎప్పుడూ తక్కువ అంచనా వేయకూడదు. అలా చేస్తే, ఇలాంటి ఫలితాలే వస్తాయని కుండ బ‌ద్ద‌లు కొట్టాడు. జట్టులోని ప్రతి ఒక్కరూ పూర్తి అంకితభావంతో, గంభీరంగా ఉండాలి. తదుపరి మ్యాచ్‌లో మేము పుంజుకుని విజయం సాధిస్తామని ఆశిస్తున్నానని తెలిపాడు.

  • Related Posts

    వైభ‌వ్ సూర్య‌వంశీపై అశ్విన్ షాకింగ్ కామెంట్స్

    Spread the love

    Spread the loveత‌న‌కు ఛాన్స్ ఇవ్వాల్సిన అవ‌స‌రం లేదు చెన్నై : భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ క్రికెట‌ర్ ర‌వి చంద్ర‌న్ అశ్విన్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశాడు. ప్ర‌స్తుతం శ్రేయాస్ అయ్య‌ర్ సార‌థ్యంలోని టీమ్ ఇండియా ఐర్లాండ్ లో ప‌ర్య‌టిస్తోంది. ఇందులో…

    ఎంఎంస్ ధోనీపై సంజు శాంస‌న్ కీల‌క కామెంట్స్

    Spread the love

    Spread the loveఐపీఎల్ లో మొద‌టి మూడు మ్యాచ్ ల వైఫ‌ల్యంపై కేర‌ళ : టీం ఇండియా స్టార్ క్రికెట‌ర్ సంజు శాంస‌న్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. ఐపీఎల్ లో రాజ‌స్తాన్ రాయ‌ల్స్ నుంచి చెన్నై సూప‌ర్ కింగ్స్ లో చేరాక…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *