ఘ‌నంగా కార్తీక దీపోత్స‌వం

Spread the love

శ్రీ గోవిందరాజ స్వామి ఆల‌యంలో
తిరుప‌తి : తిరుపతిలోని శ్రీ గోవిందరాజ స్వామివారి ఆలయంలో గురువారం కార్తీక దీపోత్సవం ఘ‌నంగా నిర్వ‌హించారు. సాయంత్రం శ్రీ పుండ‌రీక‌వ‌ళ్లి అమ్మ‌వారి ఆల‌యం నుండి కార్తీక దీపం, వ‌స్త్రాల‌ను ఆలయ ప్రాకారంలో ఊరేగింపుగా తీసుకెళ్లి శ్రీ గోవింద‌రాజ స్వామివారికి సమర్పించారు. ఈ సంద‌ర్భంగా ఆలయం, ఉపాలయాల్లో కార్తీక దీపం వెలిగించారు. ఇదే స‌మ‌యంలో భారీ ఎత్తున భ‌క్తులు హాజ‌ర‌య్యారు. టీటీడీ విస్తృత ఏర్పాట్లు చేసింది.

ఇదిలా ఉండ‌గా తిరుప‌తి న‌గ‌రంలోని అత్యంత పేరు పొందిన‌ శ్రీ కోదండ రామాలయంలో కూడా సాయంత్రం కార్తీక దీపోత్సవం ఘ‌నంగా నిర్వ‌హించారు. ఇందులో భాగంగా సాయంత్రం శ్రీ గోవిందరాజ స్వామివారి ఆలయంలోని శ్రీ పుండరీకవళ్లి అమ్మవారి సన్నిధి నుండి ఆలయ మర్యాదలతో పడి, కార్తీకదీపం, నూతన వస్త్రాలను ఊరేగింపుగా శ్రీ కోదండ రామాలయానికి తీసుకువ‌చ్చి, కార్తీక దీపాలను వెలిగించారు. దీంతో ఆల‌యాలు స‌ర్వ‌శోభాయ‌మానంగా ఆక‌ట్టుకున్నాయి భ‌క్తుల‌ను.

  • Related Posts

    తిరుమ‌ల‌లో సామాన్య భ‌క్తుల‌కే పెద్ద‌పీట‌

    Spread the love

    Spread the loveస్ప‌ష్టం చేసిన టీటీడీ చైర్మ‌న్ బీఆర్ నాయుడు తిరుమ‌ల : తిరుమ‌ల‌లో వైకుంఠ ద్వార ద‌ర్శ‌నాల‌కు సంబంధించి కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు టీటీడీ చైర్మ‌న్ బీఆర్ నాయుడు. ఆయ‌న ఈవో అనిల్ కుమార్ సింఘాల్ తో క‌లిసి మీడియాతో…

    సింహాచ‌లం అప్ప‌న్న స‌న్నిధిలో శ్రీ‌లీల‌

    Spread the love

    Spread the loveప్ర‌త్యేక పూజ‌లు చేసిన న‌టిమ‌ణి , త‌ల్లి కూడా విశాఖ‌ప‌ట్నం జిల్లా : ప్ర‌ముఖ న‌టి శ్రీ‌లీల సంద‌డి చేశారు. కోరిన కోర్కెలు తీర్చే కొంగు బంగారంగా విలసిల్లుతోంది విశాఖ‌ప‌ట్నం జిల్లాలోని పేరు పొందిన సింహాచ‌లం ఆల‌యం. ఇక్క‌డ…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *