తిరుమలలో ప్రయోగాత్మకంగా రీసైకిల్ మిషన్లు

Spread the love

ఏర్పాటుపై అదనపు ఈవో వెంక‌య్య చౌద‌రి సమీక్ష

తిరుమల : తిరుమ‌ల పుణ్య క్షేత్రంలో ప‌ర్యావ‌ర‌ణానికి భంగం క‌లిగించ‌కుండా చ‌ర్య‌లు చేప‌డుతోంది టీటీడీ. ఇందులో భాగంగా రీసైకిల్ మిషన్ల ఏర్పాటుపై తిరుమలలోని పద్మావతి అతిథి గృహంలో టీటీడీ అదనపు ఈవో సి.హెచ్.వెంకయ్య చౌదరి సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించారు. సెప్టెంబర్ నెలలో ప్రయోగాత్మకంగా తిరుమలలోని యాత్రికుల వసతి సముదాయం-5 లో ఏర్పాటు చేసిన రెక్లెయిమ్ డిపాజిట్ రీఫండ్ మిషన్లకు విశేష స్పందన వ‌చ్చింద‌న్నారు. దీంతో తిరుమలలో ఈ మిషన్లను మరి కొన్నింటిని పరిశీలనాత్మకంగా ఏర్పాటు చేయాలని స్ప‌ష్టం చేశారు.

తిరుమలలో టెట్రాపాక్, టిన్ లలో పానీయాలను స్వీకరించిన అనంతరం భక్తులు ఎక్కడంటే అక్కడ పడేయకుండా ఈ డిపాజిట్ రీఫండ్ మెషిన్ల లో వేస్తే తిరుమలలో పరిశుభ్రత మరింత మెరుగు పడేందుకు దోహద పడుతుందని సీహెచ్ వెంక‌య్య చౌద‌రి అన్నారు. ఈ విషయం పై తిరుమలలోని వ్యాపారులు, టెట్రా ప్యాక్ డీలర్లు కూడా తోటి వారిలో అవగాహన కల్పించాలని కోరారు. స్వచ్ఛ తిరుమలలో ప్రతి ఒక్కరిని భాగస్వామ్యం చేయడంలో భాగంగా ఒక ఉద్యమంలా రెక్లైమ్ రీసైకిల్ మెషిన్లపై భక్తులకు విస్తృతంగా అవగాహన కల్పించాల‌ని సూచించారు. తిరుమలలోని ముఖ్యమైన ప్రాంతాల్లో మరిన్ని మెషిన్ల ఏర్పాటుకు చ‌ర్య‌లు చేప‌ట్టాల‌ని ఆదేశించారు.

  • Related Posts

    18న మార్చి నెల దర్శన కోటా విడుద‌ల

    Spread the love

    Spread the loveప్ర‌క‌టించిన తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం తిరుమల : 2026 మార్చి నెలకు సంబంధించి టీటీడీ విడుదల చేసే వివిధ దర్శనాల, గదుల కోటా వివరాలు ఈ విధంగా ఉన్నాయి.తిరుమ‌ల శ్రీ‌వారి ఆర్జిత సేవా టికెట్ల ( సుప్రభాతం, తోమాల,…

    తిరుమ‌ల‌లోని ర‌హ‌దారుల‌కు శ్రీ‌వారి నామాలతో పేర్లు

    Spread the love

    Spread the loveటీటీడీ ఛైర్మ‌న్ బిఆర్ నాయుడు కీల‌క ప్ర‌క‌ట‌న తిరుమ‌ల : తిరుమ‌ల‌లోని ర‌హ‌దారుల‌కు శ్రీ‌వారి నామాలతో పేర్లు పెట్ట‌నున్న‌ట్లు ప్ర‌క‌టించారు టీటీడీ చైర్మ‌న్ బీఆర్ నాయుడు. టిటిడి ఇంజనీరింగ్‌ విభాగంలో నాలుగు కేటగిరిలలో ఖాళీగా ఉన్న 60 పోస్టులకు…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *