ఫిబ్రవరి 15న టీమిండియాతో ఆడేందుకు రెడీ
హైదరాబాద్ : క్రికెట్ అభిమానులకు తీపి కబురు అందింది. భారత్, శ్రీలంక దేశాలు సంయుక్తంగా నిర్వహిస్తున్న ఐసీసీ టి20 వరల్డ్ కప్ లో ఇప్పటి వరకు తాము టీమిండియాతో ఆడేది లేదంటూ ప్రకటించింది పాకిస్తాన్ క్రికెట్ బోర్డు. పాకిస్తాన్ ప్రదాని షెహబాజ్ షరీఫ్ సైతం అనుమతి ఇచ్చేది లేదంటూ ప్రకటించారు. ఈ తరుణంలో అసలు మ్యాచ్ లు జరుగుతాయా లేదా అన్న అనుమానం నెలకొంది. మరో వైపు బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు ఇండియాతో ఆడబోమంటూ ప్రకటించింది. ఇండియాలో శాంతి భద్రతలకు విఘాతం కలిగే ఛాన్స్ ఉందంటూ ఆరోపించింది. దీంతో ఐసీసీ సీరియస్ గా వార్నింగ్ ఇచ్చింది. బంగ్లాదేశ్, పాకిస్తాన్ బోర్డులకు భవిష్యత్తులో ఆడేందుకు ఛాన్స్ ఉండదని స్పష్టం చేసింది.
ఇదిలా ఉండగా ఐసీసీ నుంచి తీవ్ర ఒత్తిడి రావడంతో పాటు స్పాన్సర్ చేస్తున్న కంపెనీలు సైతం సీరియస్ గా వార్నింగ్ ఇచ్చాయి పాకిస్తాన్ క్రికెట్ బోర్డుకు. చివరకు ఒత్తిడిని తట్టుకోలేక పాకిస్తాన్ పీఎం షరీఫ్ దిగి వచ్చారు. ఒకానొక దశలో అమెరికా సైతం జోక్యం చేసుకున్నట్లు పెద్ద ఎత్తున టాక్ నడుస్తోంది. ఇది పక్కన పెడితే మంగళవారం సంచలన ప్రకటన చేశారు పీసీబీ చీఫ్ మోహిషిన్ నఖ్వీ. తాము భారత్ తో ఆడేందుకు సిద్దంగా ఉన్నామంటూ ప్రకటించాడు. ఇదిలా ఉండగా శ్రీలంక దేశ రాజధాని కొలంబో వేదికగా దాయాదులైన పాకిస్తాన్, ఇండియా జట్లు తలపడనున్నాయి.






