షాకింగ్ కామెంట్స్ చేసిన హార్దిక్ పాండ్యా
ముంబై : ఈ ఏడాదిలో జరగబోయే ప్రతిష్టాత్మకమైన, అత్యంత జనాదరణ పొందిన ఐపీఎల్ ట్రోఫీని గెలవడమే తమ లక్ష్యమని స్పష్టం చేశారు ముంబై ఇండియన్స్ కెప్టన్ హార్దిక్ పాండ్యా. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడాడు. ఈనెల 28 నుంచి ఈ టోర్నీ ప్రారంభం కానుంది. మొత్తం 10 జట్లు పాల్గొంటున్నాయి. ఈసారి తమ లక్ష్యం ఒక్కటేనని, అది ఐపీఎల్ ను కైవసం చేసుకోవడం పైనే ఫోకస్ పెట్టామన్నారు. ఇది నా ముందున్న సవాల్ అని పేర్కొన్నాడు హార్దిక్ పాండ్యా.
ముంబై ఇండియన్స్ తరఫున ఆరోసారి ఐపీఎల్ గెలవడమే నా అంతిమ కల. ముంబై ఇండియన్స్కు ఇప్పటికే అద్భుతమైన వారసత్వం ఉందన్నాడు. కానీ నేను కొత్త కుర్రాడిగా వచ్చినప్పుడు, జట్టులోని అభిరుచి, కఠోర శ్రమ, మొత్తం జట్టు నాకు అందించిన మద్దతు నాకు ఇంకా గుర్తుందని చెప్పాడు పాండ్యా. ప్రజలు ముందుకు వచ్చి, కష్టపడి, అత్యుత్తమ క్రికెట్ ఆడే సంస్కృతి కొనసాగాలని నేను కోరుకుంటున్నానని తెలిపాడు. ముంబై ఇండియన్స్ ఇప్పటివరకు ఆడిన అత్యుత్తమ క్రికెట్కు మేము ప్రాతినిధ్యం వహించాలని తాను ఆశిస్తున్నట్లు చెప్పాడు కెప్టెన్.







