రాజస్థాన్ రాయల్స్ జట్టు స్కిప్పర్ కామెంట్స్
ముల్లాన్ పూర్ : ఐపీఎల్ 2026 లో భాగంగా జరిగిన కీలక పోరులో బలమైన పంజాబ్ కింగ్స్ ఎలెవన్ జట్టుకు కోలుకోలేని షాక్ ఇచ్చింది రాజస్థాన్ రాయల్స్. తొలుత బ్యాటింగ్ చేసింది పంజాబ్ . నిర్ణీత 20 ఓవర్లలో 222 రన్స్ చేసింది. అనంతరం సునాయసంగా టార్గెట్ ను పూర్తి చేసింది. మ్యాచ్ అనంతరం జట్టు కెప్టెన్ రియాన్ పరాగ్ మీడియాతో మాట్లాడాడు. ఈ విజయంతో ప్రత్యర్థులకు మా సత్తా ఏమిటో అర్థమై పోయిందన్నాడు. తాము ఎవరినీ పరిగణలోకి తీసుకోబోమని పేర్కొన్నాడు. ఫామ్ అనేది తాత్కాలికమని, క్లాస్ అనేది శాశ్వతం అన్నాడు.
కొందరు కావాలని తమను టార్గెట్ చేయడాన్ని తప్పు పట్టాడు. వారి ఆందోళనలు మాకు సంబంధించినవి కావు, అందరివని కొట్టి పారేశాడు. చూస్తున్న ప్రతిఒక్కరూ, వ్యాఖ్యానిస్తున్న ప్రతిఒక్కరూ వారి ఆందోళనలతో తమకు సంబంధం లేదన్నాడు పరాగ్. మా ఆటగాళ్లపై, వారి సామర్థ్యాలపై మాకు చాలా నమ్మకం ఉందని చెప్పాడు.. మిడిల్ ఆర్డర్ విఫలమైనప్పుడు, ఓపెనర్లు, ఇతరులు జట్టును ముందుకు నడిపించాలి. మిడిల్ ఆర్డర్ రాణించినప్పుడు, మేము జట్టును ముందుకు నడిపిస్తామన్నాడు. కాబట్టి ఒక జట్టుగా, మాకు జట్టుపై పూర్తి నమ్మకం ఉందన్నాడు. ఈసారి టైటిల్ పక్కా తమదేనని ధీమా వ్యక్తం చేశాడు.






