శ్రీ పద్మావతి అమ్మవారి వసంతోత్సవాలకు అంకురార్పణ

Spread the love

భారీ ఎత్తున హాజ‌రైన భ‌క్త బాంధ‌వులు..టీటీడీ భారీ ఏర్పాట్లు

తిరుపతి : తిరుచానూరు లోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో వసంతోత్సవాలకు శాస్త్రోక్తంగా అంకురార్పణ జరిగింది. సాయంత్రం 6 నుండి 7.30 గంటల వరకు పుణ్యా హవచనం, రక్షా బంధనం, అంకురార్పణ, సేనాధిపతి ఉత్సవం నిర్వహించారు . ఏప్రిల్ 30 నుండి మే 2 వరకు వసంతోత్సవాలు జరుగనున్నాయి. భక్తులు రూ.150 చెల్లించి ఈ ఉత్సవాల్లో పాల్గొనవచ్చు అని తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్తానం పాల‌క మండ‌లి జేఈవో వి. వీర‌బ్ర‌హ్మం తెలిపారు.

మే 1న ఉదయం 9.30 గంటలకు స్వర్ణ రథోత్సవం జరుగుతుందని పేర్కొన్నారు. మూడు రోజుల పాటు మధ్యాహ్నం 2.30 నుండి సాయంత్రం 4.30 వరకుస్నపన తిరుమంజనం నిర్వహిస్తారు. రాత్రి 7.30 నుండి 8.30 వరకు అమ్మవారు నాలుగు మాడ వీధుల్లో ఊరేగింపుగా విహరిస్తారు. ఇవాళ జ‌రిగిన ఈ కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈవో హరీంధ్రనాథ్, అర్చకులు బాబుస్వామి తదితరులు పాల్గొన్నారు. భారీ ఎత్తున వ‌చ్చిన భ‌క్తుల‌కు విస్తృత ఏర్పాట్లు చేసింది టీటీడీ.

  • Related Posts

    సింహాచ‌లం స‌న్నిధిలో అశ్విని వైష్ణ‌వ్, బాబు

    Spread the love

    Spread the loveతెలుగు ప్ర‌జ‌లు బాగుండాల‌ని కోరుకున్నా విశాఖ‌ప‌ట్నం జిల్లా : విశాఖ జిల్లా తర్లువాడలో గూగుల్ క్లౌడ్ ఏఐ హబ్ కు శంకుస్థాపన అనంతరం సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామి వారిని దర్శించుకున్నారు కేంద్ర మంత్రి అశ్విని…

    వీర‌బ్ర‌హ్మేంద్ర స్వామి మ‌ఠాధిప‌తి ద‌ర్శ‌నం

    Spread the love

    Spread the loveశ్రీశ్రీశ్రీ వీర ధర్మజ వెంకటాద్రి స్వామి ఆశీర్వాదం నంద్యాల జిల్లా : ఆళ్ల‌గ‌డ్డ నియోక‌వ‌ర్గంలోని శ్రీ బ్రహ్మంగారి మఠం లో శ్రీ స్వాములవారి 333వ ఆరాధన గురుపూజ మహోత్సవాలు ఘ‌నంగా నిర్వ‌హించారు. ఉత్స‌వాల‌లో భాగంగా ఈ రోజున వైశాఖ…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *