Category: News
-

పరకామణి వివాదంపై సీబీఐ విచారణ చేపట్టాలి
కేంద్ర మంత్రి అమిత్ షాకు లేఖ రాసిన ఎంపీ తిరుపతి : తిరుమల పరకామణి అంశంపై రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న తప్పుడు ఆరోపణల వల్ల ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్లాది భక్తుల విశ్వాసం దెబ్బ తింటోందని తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి ఆందోళన వ్యక్తం చేశారు. ఈ అంశం సిబిఐ విచారణ కోరుతూ కేంద్ర హోం మంత్రి అమిత్ షాకి, భారత సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తికి వేర్వేరుగా లేఖలు రాశారు. రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి ఆధారాలు లేకుండా…
-

పామాయిల్ ఫ్యాక్టరీ భావోద్వేగంతో కూడుకున్నది
ఆనందంగా ఉందన్న తన్నీరు హరీశ్ రావు సంగారెడ్డి జిల్లా : సిద్దిపేటలో పామాయిల్ ఫ్యాక్టరీ అనేది ఒక భావోద్వేగంతో కూడుకుని ఉన్నదని అన్నారు మాజీ మంత్రి హరీశ్ రావు. దీని వల్ల రైతుల జీవితాల్లో గుణాత్మకమైన మార్పు వస్తుందని అన్నారు. ఈ ఫ్యాక్టరీ రావడానికి కష్టపడింది, చెమట చిందించింది బీఆర్ఎస్ పార్టీ అని గుర్తు చేశారు. విత్తనం నాటింది బిఆర్ఎస్ కానీ ఆ పండ్లను తినడానికి కాంగ్రెస్ బయలు దేరిందని అన్నారు. రేవంత్ రెడ్డి రిబ్బన్ కత్తిరించడానికి…
-

ఫిరాయింపు ఎమ్మెల్యేలపై వేటు పడడం ఖాయం
స్పష్టం చేసిన మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి హైదరాబాద్ : పార్టీ మారిన ఎమ్మెల్యేలపై వేటు పడడం ఖాయమని స్పష్టం చేశారు మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి. సోమవారం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఎమ్మెల్యేలతో కలిసి మాట్లాడారు. నియోజకవర్గ ప్రజలకు ద్రోహం చేసి పార్టీ మారారని వారిని ప్రజలు క్షమించరని అన్నారు. అన్ని ఆధారాలు శాసన సభ సెక్రటరీకి సమర్పించడం జరిగిందని చెప్పారు. తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ సరైన నిర్ణయం తీసుకుంటారని భావిస్తున్నాం…
-

ఆర్ఆర్ఆర్ బాధితులకు అండగా ఉంటాం : కేటీఆర్
నల్గొండ, సూర్యాపేట, గజ్వేల్, సంగారెడ్డి బాధితుల గోస హైదరాబాద్ : రీజినల్ రింగ్ రోడ్డు బాధితులు ఎవరూ ఆందోళన చెందాల్సిన పని లేదన్నారు మాజీ మంత్రి కేటీఆర్. సోమవారం తెలంగాణ భవన్ లో తనను నల్గొండ, సూర్యాపేట జిల్లా, గజ్వేల్, సంగారెడ్డి నియోజకవర్గాల ఆర్ఆర్ఆర్ బాధితులు కలిశారు. తమ గోడు వెళ్ల బోసుకున్నారు. వారిని ఉద్దేశించి ప్రసంగించారు కేటీఆర్. నల్గొండలో రీజినల్ రింగ్ రోడ్డు వల్ల ఎవరికి ఇబ్బంది లేకుండా చూస్తామని కేంద్రంలోని రాహుల్ గాంధీ, ప్రియాంక…
-

బోనస్ పేరుతో బోగస్ : హరీశ్ రావు
సింగరేణి కార్మికులకు సర్కార్ శాపం హైదరాబాద్ : మాజీ మంత్రి తన్నీరు హరీశ్ రావు కాంగ్రెస్ సర్కార్ పై దుమ్మెత్తి పోశారు. తాజాగా సీఎం రేవంత్ రెడ్డి చేసిన ప్రకటనపై మండిపడ్డారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. సింగరేణి కార్మికుల బోనస్ పేరుతో బోగస్ చేసిందంటూ రేవంత్ ప్రభుత్వంపై మండిపడ్డారు. కార్మికులకు ఇచ్చే లాభాల్లో 50 శాతానికి పైగా కోత విధించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సంస్థ పరంగా సింగరేణి మొత్తం రూ. 6394 కోట్ల లాభాలు…
-

విజయవాడ ఉత్సవం ఏపీకి గర్వకారణం
ఏపీ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు అమరావతి : విజయవాడ ఉత్సవ్ ద్వారా ఆంధ్రప్రదేశ్ సాంస్కృతిక వైభవం దేశ వ్యాప్తంగా ప్రతిధ్వనిస్తుందని స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు అన్నారు. ఆంధ్రప్రదేశ్ టూరిజం ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో జరుగుతున్న ఈ మహోత్సవం ప్రపంచంలోనే అతి పెద్ద పండుగ కార్నివల్గా నిలుస్తుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. స్పీకర్ కార్యాలయంలో సోమవారం శాసన సభ్యులు బోండా ఉమా , గద్దే రామ్మోహన్ , బోడె ప్రసాద్ మర్యాద పూర్వకంగా స్పీకర్ చింతకాయల…
-

పండుగల వేళ ఆప్కో భారీ డిస్కౌంట్
కొనుగోలు చేయాలని కోరిన మంత్రి సవిత అమరావతి : ఏపీ సర్కార్ దుస్తుల కొనుగోలుదారులకు తీపి కబురు చెప్పింది. దసరా, దీపావళి పండుగలను పురస్కరించుకుని కీలక నిర్ణయం తీసుకున్నారు రాష్ట్ర బీసీ, జౌళి, పరిశ్రమల శాఖ మంత్రి ఎస్. సవిత. ఈ మేరకు ఆమె సోమవారం ఆప్కో ద్వారా ఉత్పత్తులకు భారీ ఎత్తున డిస్కౌంట్ ఇవ్వాలని ఆదేశించారు. ఇందులో భాగంగా ఇవాల్టి నుంచి అన్ని ఉత్పత్తులపై ఏకంగా 40 శాతం డిస్కౌంట్ ఇస్తున్నట్లు ప్రకటించారు. దీని వల్ల…
-

డీప్యూటీ సీఎంకు నారా లోకేష్ ఆహ్వానం
నియామక పత్రాలు అందించే కార్యక్రమానికి రండి అమరావతి : రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కొణిదలనను ఆయన ఛాంబర్ లో విద్య, ఐటి శాఖల మంత్రి నారా లోకేష్ సోమవారం మర్యాద పూర్వకంగా కలుసుకున్నారు. ఈ నెల 25న మెగా డీఎస్సీ విజేతలకు నియామక ఉత్తర్వులు అందించే కార్యక్రమానికి హాజరు కావాలని పవన్ కల్యాణ్ ను ఆహ్వానించారు. గత అయిదేళ్లలో ఒక్క టీచర్ పోస్టు భర్తీ చేయక పోగా, మెగా డీఎస్సీని అడ్డుకునేందుకు ప్రత్యర్థులు దాదాపు…
-

దిగ్గజ సంస్థలతో కలిసి క్వాంటం వ్యాలీ : సీఎం
ఏపీలో ఏర్పాటు చేస్తామన్న చంద్రబాబు నాయుడు విశాఖపట్నం : ఆంధ్రప్రదేశ్ లో ఐబీఎం, టీసీఎస్, ఎల్ అండ్ టీ సంస్థలతో కలిసి క్వాంటం వ్యాలీని ఏర్పాటు చేస్తున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వెల్లడించారు. క్వాంటం కంప్యూటర్ సేవలను ప్రభుత్వాలు, విద్య, వైద్య సంస్థలు వినియోగించుకునే అవకాశం ఉందని అన్నారు. క్వాంటం వ్యాలీతో ఇక్కడ ఓ ఎకో సిస్టం ఏర్పాటు అవుతోందని తెలిపారు. క్వాంటం కంప్యూటర్లు, పరికరాల తయారీ సంస్థలు కూడా పెట్టుబడులతో ముందుకు వచ్చాయని ముఖ్యమంత్రి…
-

చెత్తనే కాదు చెత్త రాజకీయాలను క్లీన్ చేస్తా
సీఎం నారా చంద్రబాబు నాయుడు ప్రకటన పల్నాడు జిల్లా : చెత్తనే కాదు చెత్త రాజకీయాలను శుభ్రం చేస్తానని ప్రకటించారు సీఎం నారా చంద్రబాబు నాయుడు. స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర కోసం పల్నాడుకు వచ్చాను. స్ఛచ్చాంధ్ర అంటే చెత్తను తొలగించి రాష్ట్రాన్ని పరిశుభ్రంగా చేయడం. గత ప్రభుత్వం లక్షల మెట్రిక్ టన్నుల చెత్తను రోడ్లపై వదిలేసి పోయిందన్నారు. చెత్త పైనా పన్ను వేశారు. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత చెత్త పన్నుతో పాటు వారు వదిలి వెళ్లిన చెత్తనూ తొలగించాం…
Latest News

Stay Connected
Categories
BUSSINESS DEVOTIONAL EDITORS CHOICE ENTERTAINMENT News SPORTS
Tags
#AP #KarantakaVSAndhraRow #Investmentss #ITMinisters #NaraLokesh #PriyankaaKharge #BanoothuNagesh #Delhi #NationalSTCommission #BRS #HarishRao #Congress #CM #RevanthReddy #CM #HYDRAA @Vemnarenderredy @GandhiArekapudi @mkrkkpmla @Collector_MDL #IITRamaiah #100Years #KTR #Kavitha #chandraBabuNaidu #PoliceCompliantee #MovieTeaser #VaaralaaxmiSharathkumar #NaveenChandra #RythannaMeeKosam #FarmersFriendlyGovt #IdhiManchiPrabhutvam #ChandrababuNaidu #AndhraPradesh #Telaangana #KalwakuntlaKaavitha #APLeaders #ChandraBabu #Telangana #Hyderabad #FootBallMatch #CM #RevanthReddy #Messi #Telanngana #CS #RamaKrishnaRao #SanjayJaju #TGSRTC #MD #VCSajjnar #Dussera #Bathukamma #SpecialBusses #7 @Comm_HYDRAA @MDHMWSSB Commissioner Dr. Srijana hashtag#TiEHyderabad hashtag#Entrepreneurship hashtag#Startups hashtag#Innovation hashtag#Networking hashtag#HES2025 IAS MD
About the Author

AF themes
Easy WordPress Websites Builder: Versatile Demos for Blogs, News, eCommerce and More – One-Click Import, No Coding! 1000+ Ready-made Templates for Stunning Newspaper, Magazine, Blog, and Publishing Websites.

Search the Archives
Access over the years of investigative journalism and breaking reports











