శ్రీ తిరుమలనాధ స్వామికి ప‌ట్టు వ‌స్త్రాల స‌మ‌ర్ప‌ణ‌

టీటీడీ చైర్మ‌న్ బీఆర్ నాయుడు, ఎమ్మెల్సీ మ‌ల్ల‌న్న‌

యాదాద్రి జిల్లా : యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మల రామారం మండలం చీకటిమామిడి గ్రామంలో వెలసిన శ్రీ తిరుమలనాధ స్వామి బ్రహ్మోత్స‌వాలు అంగ‌రంగ వైభ‌వంగా ప్రారంభం అయ్యాయి. ఉత్స‌వాల‌లో భాగంగా టిటిడి ఛైర్మెన్ బీఆర్ నాయుడు స్వామి వారికి పట్టు వస్త్రాలను సమర్పించారు. శ్రీ తిరుమలనాధ స్వామి ఆలయానికి టిటిడి చైర్మెన్ చేరుకోగానే ఆలయ పండితులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. స్వామి వారి దర్శనాంతరం ఆలయ అధికారులు, అర్చకులు తీర్థ ప్రసాదాలను అందించారు. అనంతరం తిరు కల్యాణ మహోత్సవంలో ఆయన పాల్గొన్నారు.

ఈ సందర్భంగా టిటిడి ఛైర్మెన్ బీఆర్ నాయుడు మాట్లాడారు. తిరుమల పేరుతో తిరుమలనాధ స్వామి ఆలయం ఉండడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఎన్నో వందల ఏళ్ళ చరిత్ర ఉన్న శ్రీ తిరుమలనాధ స్వామి వారు భక్తులు కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారమని తెలిపారు. ఈ ఆలయ అభివృద్ధికి టిటిడి సహకారం అందిస్తుందని ప్ర‌క‌టించారు . ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న, ఆలయ అధికారులు, సిబ్బంది, అర్చకులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

  • Related Posts

    శ్రీ‌వారి ఉద్యోగులకు వెండి డాలర్‌, ప్రశంసా పత్రాలు

    తిరుపతి : తిరుపతి టీటీడీ పరిపాలనా భవనంలో భారత స్వాతంత్య్ర వేడుకలు ఘనంగా జరిగాయి. ఇక్కడి పరేడ్‌ మైదానంలో టీటీడీ ఛైర్మ‌న్ బీఆర్ నాయుడు జాతీయ జెండాను ఎగురవేసి వందనం చేశారు. భద్రతా సిబ్బంది నుండి గౌరవ వందనం స్వీకరించారు. ఈ…

    ఆగ‌స్టు 17 నుంచి ఆధ్యాత్మిక సేవ‌ల‌పై జాతీయ స‌ద‌స్సు

    తిరుపతి : తిరుపతిలోని అన్నమాచార్య కళా మందిరంలో టీటీడీ ఆళ్వార్ దివ్య ప్రబంధ ప్రాజెక్టు ఆధ్వర్యంలో ఆగస్టు 17 నుంచి 19వ తేదీ వరకు శ్రీ వైష్ణవ ఆచార్యుల ఆధ్యాత్మిక సేవలపై జాతీయ సదస్సు నిర్వహించనున్నారు. శ్రీ రామానుజులు, ఆచార్య పుండరీకాక్షులు,…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *