చెల‌రేగిన ఇషాన్ రాజ‌స్తాన్ ప‌రేషాన్

5 వికెట్ల తేడాతో వ‌రుస విజ‌యం

జైపూర్ : ఐపీఎల్ 2026లో కావ్య మార‌న్ మేనేజ్మెంట్ కు చెందిన స‌న్ రైజ‌ర్స్ జ‌ట్టు ఊహించ‌ని రీతిలో దుమ్ము రేపుతోంది. విజ‌యాల ప‌రంప‌ర కొన‌సాగిస్తోంది. పాయింట్ల ప‌ట్టిక‌లో దూసుకు పోయింది. ఇంకో వైపు ఆతిథ్య జ‌ట్టు రాజ‌స్థాన్ రాయ‌ల్స్ కు చుక్క‌లు చూపించింది హైద‌రాబాద్ . ముందుగా బ్యాటింగ్ కు దిగిన రాజ‌స్తాన్ రాయ‌ల్స్ నిర్దేశించిన ల‌క్ష్యాన్ని అల‌వోకగా చేదించింది. ప్ర‌ధానంగా కెప్టెన్ ఇషాన్ కిష‌న్ బాధ్య‌తాయుత‌మైన ఇన్నింగ్స్ తో ఆక‌ట్టుకున్నాడు. ఓపెన‌ర్ ట్రావిస్ హెడ్ మ‌రోసారి విఫ‌లం అయ్యాడు. అనంత‌రం మైదానంలోకి వ‌చ్చిన కిష‌న్ దూకుడు పెంచాడు.

ఓపెన‌ర్ అభిషేక్ శ‌ర్మ‌తో క‌లిసి ఇషాన్ కిష‌న్ చెల‌రేగి ఆడాడు. ఈ ఇద్ద‌రు బౌల‌ర్లు రాజ‌స్తాన్ బౌల‌ర్ల‌ను ఉతికి ఆరేశారు. ఇషాన్ కిష‌న్ 31 బంతుల్లో 74 ర‌న్స్ చేశాడు. ఇందులో 11 ఫోర్లు 3 సిక్సులు ఉన్నాయి. అభిషేక్ శ‌ర్మ 57 29 బాల్స్ ఎదుర్కొని 57 ర‌న్స్ చేశాడు. 11 ఫోర్లు ఒక సిక్స్ ఉంది. ఈ ఇద్ద‌రూ క‌లిసి తొలి వికెట్ భాగ‌స్వామ్యానికి 132 ప‌రుగులు జోడించారు. నితీశ్ కుమార్ 36 ర‌న్స్ చేస్తే క్లాసెన్ 29 ప‌రుగులు చేశారు. రాజ‌స్తాన్ బౌల‌ర్ల‌లో బ్రిజేష్ 44 ర‌న్స్ ఇచ్చి 2 వికెట్లు కూల్చితే ఆర్చ‌ర్ 34 ప‌రుగులు ఇచ్చి 2 వికెట్లు తీశాడు.

  • Related Posts

    ఐపీఎల్ 2027లో ఎంఎస్ ధోనీ ఆడేది క‌ష్ట‌మే ..?

    చెన్నై : అంద‌రి క‌ళ్లు మ‌హేంద్ర సింగ్ ధోనీపై ఉన్నాయి. ఈ ఏడాది 2026లో జ‌రిగిన ఐపీఎల్ లో ఆశించిన మేర రాణించ‌లేదు సీఎస్కే జ‌ట్టు. నిరాశజనకమైన ప్రదర్శనతో ప్లేఆఫ్స్‌కు చేరలేక పోయింది, ఇది అభిమానులను తీవ్ర నిరాశకు గురిచేసింది. దీనికి…

    ఐపీఎల్ సరైన సమయంలో జరగడం లేదు

    ఇంగ్లండ్ : ఐపీఎల్ మాజీ చైర్మ‌న్ ల‌లిత్ మోడీ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. భార‌త దేశంలో తొలిసారిగా ఇండియ‌న్ ప్రిమీయ‌ర్ లీగ్ ను ప్రారంభించినప్పుడు ఏప్రిల్-మే నెలల విండోను ఎవరూ కోరుకో లేద‌న్నారు. ఎందుకంటే ఆ సమయంలో క్రికెట్ చాలా తక్కువగా…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *