ఐర్లాండ్ తో ఓట‌మి పై అయ్య‌ర్ కామెంట్స్

మేం మ‌ళ్లీ పుంజుకుంటామ‌ని ప్ర‌క‌ట‌న

ఐర్లాండ్ : ఐర్లాండ్ తో జ‌రిగిన కీల‌క మ్యాచ్ లో అత్యంత బ‌ల‌మైన భార‌త జ‌ట్టు పేల‌వ‌మైన ఆట‌తీరును ప్ర‌ద‌ర్శించింది. భారీ తేడాతో ఓడి పోయింది. ఈ సంద‌ర్బంగా జ‌ట్టు కెప్టెన్ శ్రేయాస్ అయ్య‌ర్ స్పందించాడు. ఈ మ్యాచ్‌లో ఓడిపోవడం నిజంగా నిరాశను కలిగిస్తోందని అన్నాడు. ఇది మాకు నిజంగా అవమానకరమైన ఓటమి అని పేర్కొన్నాడు. ఏ విషయాన్నీ తేలికగా తీసుకోకూడదని నేను భావిస్తున్నానని తెలిపాడు. ప్రతి మ్యాచ్‌నూ పూర్తి గంభీరతతో ఆడాల‌ని సూచించాడు స‌హ‌చ‌ర ఆట‌గాళ్ల‌కు.

కేవలం మైదానంలో అడుగు పెట్టినంత మాత్రాన విజయం దక్కద‌న్నాడు. గెలవాలంటే కష్టపడాలి మరియు పూర్తి ఏకాగ్రతతో ఉండాలి. నేను ఇంతకు ముందే చెప్పినట్లుగా, మనం ప్రస్తుత క్షణంపై దృష్టి పెట్టాలని పేర్కొన్నాడు శ్రేయాస్ అయ్య‌ర్. ప్రత్యర్థిని ఒత్తిడిలోకి నెట్టే అవకాశం దొరికినప్పుడల్లా, దానిని మనం పూర్తిగా సద్వినియోగం చేసుకోవాల‌ని సూచించాడు.. ఏ ప్రత్యర్థినీ ఎప్పుడూ తక్కువ అంచనా వేయకూడదు. అలా చేస్తే, ఇలాంటి ఫలితాలే వస్తాయని కుండ బ‌ద్ద‌లు కొట్టాడు. జట్టులోని ప్రతి ఒక్కరూ పూర్తి అంకితభావంతో, గంభీరంగా ఉండాలి. తదుపరి మ్యాచ్‌లో మేము పుంజుకుని విజయం సాధిస్తామని ఆశిస్తున్నానని తెలిపాడు.

  • Related Posts

    ఐపీఎల్ 2027లో ఎంఎస్ ధోనీ ఆడేది క‌ష్ట‌మే ..?

    చెన్నై : అంద‌రి క‌ళ్లు మ‌హేంద్ర సింగ్ ధోనీపై ఉన్నాయి. ఈ ఏడాది 2026లో జ‌రిగిన ఐపీఎల్ లో ఆశించిన మేర రాణించ‌లేదు సీఎస్కే జ‌ట్టు. నిరాశజనకమైన ప్రదర్శనతో ప్లేఆఫ్స్‌కు చేరలేక పోయింది, ఇది అభిమానులను తీవ్ర నిరాశకు గురిచేసింది. దీనికి…

    ఐపీఎల్ సరైన సమయంలో జరగడం లేదు

    ఇంగ్లండ్ : ఐపీఎల్ మాజీ చైర్మ‌న్ ల‌లిత్ మోడీ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. భార‌త దేశంలో తొలిసారిగా ఇండియ‌న్ ప్రిమీయ‌ర్ లీగ్ ను ప్రారంభించినప్పుడు ఏప్రిల్-మే నెలల విండోను ఎవరూ కోరుకో లేద‌న్నారు. ఎందుకంటే ఆ సమయంలో క్రికెట్ చాలా తక్కువగా…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *