Category: News

  • విశాఖ ఘ‌ట‌న‌పై జ‌గ‌న్ దిగ్భ్రాంతి రేపు ప‌రామ‌ర్శ‌

    విశాఖ ఘ‌ట‌న‌పై జ‌గ‌న్ దిగ్భ్రాంతి రేపు ప‌రామ‌ర్శ‌

    క్ష‌త‌గాత్రుల‌కు మెరుగైన వైద్య చికిత్స అందించాలి తాడేప‌ల్లి గూడెం : విశాఖ స్టీల్ ప్లాంట్ ఘ‌ట‌న‌పై తీవ్ర దిగ్భ్రాంతి వ్య‌క్తం చేశారు మాజీ సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి. ఈ సంద‌ర్బంగా ఆయ‌న బుధ‌వారం విశాఖ‌లో ప‌ర్య‌టిస్తారు. ప్రమాద బాధితులను పరామర్శించ నున్న‌ట్లు వైసీపీ పేర్కొంది. విశాఖ స్టీల్ ప్లాంట్‌లో ఇటీవల జరిగిన ఘోర ప్రమాదంలో పలువురు కార్మికులు ప్రాణాలు కోల్పోవడం, మరికొందరు తీవ్ర గాయాలతో విశాఖపట్నంలోని వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతుండడం పట్ల తీవ్ర దిగ్భ్రాంతి…

    Continue Reading

  • రేపు ఢిల్లీకి సీఎం చంద్రబాబు నాయుడు

    రేపు ఢిల్లీకి సీఎం చంద్రబాబు నాయుడు

    10,11 తేదీల్లో ఢిల్లీలోనే ఉండనున్న సీఎం అమరావతి : ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు రెండు రోజుల పర్యటనుకు ఢిల్లీ వెళుతున్నారు. జూన్ 10, 11వ తేదీల్లో సీఎం ఢిల్లీలో ఉండనున్నారు. 10వ తేదీ బుధవారం ఉదయం 11.30 గంటలకు గన్నవరం ఎయిర్‌పోర్ట్ నుంచి ఢిల్లీ బయలుదేరి వెళతారు. ఢిల్లీలోని భారత్ మండపంలో జరిగే ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల సమావేశానికి సీఎం చంద్రబాబు హాజరవుతారు. మధ్యాహ్నం 3.00 గంటల నుంచి రాత్రి 9.00 గంటల వరకు జరిగే…

    Continue Reading

  • పోలీసు శాఖలో సమన్వయంపై డీజీపీ ఫోక‌స్

    పోలీసు శాఖలో సమన్వయంపై డీజీపీ ఫోక‌స్

    స్టాఫ్ ఆఫీస‌ర్స్ మీటింగ్ తిరిగి ప్రారంభం హైద‌రాబాద్ : తెలంగాణ రాష్ట్ర డీజీపీగా నియ‌మితులైన సీవీ ఆనంద్ కీల‌క చ‌ర్య‌లు ప్రారంభించారు. చాలా కాలంగా నిలిచి పోయిన “స్టాఫ్ ఆఫీసర్స్ మీటింగ్”ను డీజీపీ మళ్లీ ప్రారంభించారు. ప్రతి పక్షం .సీనియర్ అధికారులు సమావేశమై విధానాలు, కార్యక్రమాలు, శాఖల మధ్య అంశాలపై చర్చిస్తున్నారు. నేపాల్‌తో పాటు ఇతర దేశాల నుంచి వచ్చిన గృహ కార్మికుల వివరాలను క్రమబద్ధమైన డేటాబేస్‌లో నమోదు చేసి పర్యవేక్షణ, భద్రతను మరింత బలోపేతం చేయాలని…

    Continue Reading

  • పాక్ ఆక్ర‌మిత కాశ్మీర్ లో హ‌క్కుల ఉల్లంఘ‌న

    పాక్ ఆక్ర‌మిత కాశ్మీర్ లో హ‌క్కుల ఉల్లంఘ‌న

    ఆందోళ‌న వ్య‌క్తం చేసిన బ్రిటిష్ ఎంపీలు లండ‌న్ : పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్ (PoK)లో జరుగుతున్న మానవ హక్కుల ఉల్లంఘనలు, పాలనాపరమైన సమస్యలపై ఆందోళన వ్యక్తం చేస్తూ యునైటెడ్ కింగ్‌డమ్‌కు చెందిన 50 మంది పార్లమెంట్ సభ్యుల బృందం ఒక లేఖపై సంతకం చేసింది. ఆ ప్రాంతంలో మరింత పారదర్శకత, జవాబుదారీతనం, ప్రాథమిక హక్కుల పరిరక్షణ కల్పించాలని ఎంపీలు పిలుపునిచ్చారు. భావప్రకటనా స్వేచ్ఛ, రాజకీయ ప్రాతినిధ్యంపై ఆంక్షలు, స్థానిక నివాసితుల పట్ల వ్యవహరిస్తున్న తీరుపై ఆందోళనలను ఈ…

    Continue Reading

  • యూసుఫ్ ప‌ఠాన్ పై మ‌హువా మోయిత్రా ఫైర్

    యూసుఫ్ ప‌ఠాన్ పై మ‌హువా మోయిత్రా ఫైర్

    టీఎంసీపై గెలిచి అమిత్ షాను క‌లిస్తే ఎలా కోల్ క‌తా : టీఎంసీ ఎంపీ మ‌హూవా మోయిత్రా నిప్పులు చెరిగారు. భార‌త మాజీ క్రికెట‌ర్, టీఎంసీ ఎంపీగా ఉన్న యూసుఫ్ ప‌ఠాన్ ను ఏకి పారేశారు. మమతా బెనర్జీకి అత్యంత విశ్వసనీయ నాయకురాలు అయిన మహువా మోయిత్రా యూసుఫ్ పఠాన్‌ను మందలిస్తూ ట్వీట్ చేశారు. యూసుఫ్ పఠాన్, అమిత్ షా పిలిచారని మీరు ఢిల్లీకి హడావిడిగా వెళ్తున్నారు. మీరు దేశం కోసం క్రికెట్ ఆడారు, బెంగాల్ ప్రజలు…

    Continue Reading

  • విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాదం బాధాక‌రం

    విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాదం బాధాక‌రం

    ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్ దిగ్భ్రాంతి అమ‌రావ‌తి : ఏపీలోని విశాఖ స్టీల్ ప్లాంట్ లో చోటు చేసుకున్న ప్రమాదంలో తొమ్మిది మంది కార్మికులు మృతి చెందిన ఘటనపై రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తీవ్ర ఆవేద‌న వ్య‌క్తం చేశారు. మృతుల కుటుంబాల‌ను ఆదుకుంటామ‌ని తెలిపారు. గాయ‌ప‌డిన వారికి మెరుగైన చికిత్స అంద‌జేస్తున్నామ‌న్నారు. ప్రమాదం గురించి విశాఖ జిల్లా కలెక్టర్, నగర పోలీస్ కమిషనర్ ద్వారా వివరాలు తెలుసుకున్నారు. స్టీల్ ప్లాంట్ లో చేపట్టిన…

    Continue Reading

  • కేంద్రం నిర్వాకంపై ఇండియా కూట‌మి యుద్దం

    కేంద్రం నిర్వాకంపై ఇండియా కూట‌మి యుద్దం

    స్పష్టం చేసిన కూట‌మి పార్టీ నేత‌ల వార్నింగ్ న్యూఢిల్లీ : దేశ రాజ‌ధాని ఢిల్లీలో సోమ‌వారం కాన్‌స్టిట్యూషన్ క్లబ్‌లో ‘ఇండియా’ (INDIA) కూటమికి సంబంధించిన ఒక ముఖ్యమైన సమావేశం జరిగింది. ఈ సమావేశంలో సీపీపీ (CPP) చైర్‌పర్సన్ సోనియా గాంధీ, కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే , ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీతో పాటు ‘ఇండియా’ కూటమికి చెందిన సీనియర్ నాయకులు పాల్గొన్నారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత ‘ఇండియా’ (INDIA) కూటమి వ్యూహరచనలో మార్పులు చోటు చేసుకున్నాయి.…

    Continue Reading

  • రామోజీరావుకు సీఎం చంద్ర‌బాబు నివాళి

    రామోజీరావుకు సీఎం చంద్ర‌బాబు నివాళి

    ఆయ‌న చేసిన సేవ‌లు చిర‌స్మ‌ర‌ణీయం అమ‌రావ‌తి : అక్షర యోధుడు రామోజీరావు వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు అర్పించారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. తెలుగు జాతి గర్వించదగ్గ మహనీయుడు అని పేర్కొన్నారు. మీడియా రంగంలో ఓ యుగకర్త, అక్షర యోధుడు రామోజీరావు గారి 2వ వర్ధంతి సందర్భంగా ఆయనకు ఘన నివాళులు. సామాన్య కుటుంబం నుంచి అసామాన్య శిఖరాలను అధిరోహించి, మీడియాను ప్రజా చైతన్యానికి వేదికగా మలిచిన ఆయన సేవలు చిరస్మరణీయం అని ప్ర‌శంసించారు సీఎం.…

    Continue Reading

  • బీహార్‌లో నెల్లూరు యాత్రికుల బస్సు ప్రమాదం

    బీహార్‌లో నెల్లూరు యాత్రికుల బస్సు ప్రమాదం

    బాధాక‌ర‌మ‌న్న మాజీ సీఎం వైఎస్ జ‌గ‌న్ రెడ్డి తాడేప‌ల్లి గూడెం : బీహార్ రాష్ట్రంలోని ఔరంగాబాద్ సమీపంలో నెల్లూరు జిల్లా నుంచి కాశీయాత్రకు వెళ్తున్న ప్రైవేట్ బస్సు రోడ్డు ప్రమాదానికి గురైంది. ఈ ఘ‌ట‌న‌లో ముగ్గురు భక్తులు మృతి చెందారు. ప‌లువురు గాయ‌ప‌డ్డారు. ఈ ఘటనపై మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైయస్ జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. నెల్లూరు జిల్లా నుంచి ఉత్తర భారతదేశ యాత్రకు బయల్దేరిన యాత్రికులు ప్రయాణిస్తున్న బస్సును ఎదురుగా వస్తున్న లారీ…

    Continue Reading

  • డయల్ యువర్ ఎపిఎస్పిడిసిఎల్ సిఎండి

    డయల్ యువర్ ఎపిఎస్పిడిసిఎల్ సిఎండి

    వినియోగ‌దారుల స‌మ‌స్య‌ల‌కు ప‌రిష్కారం తిరుపతి : విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కారం కోసం జూన్ 8వ తేదీన సోమ‌వారం ఉదయం 10:00 గం||ల నుంచి మధ్యాహ్నం 12:30 గం||ల వరకు ‘డయల్ యువర్ సిఎండి’ కార్యక్రమాన్ని ఏపీఎస్పీడీసీఎల్ నిర్వహించింది. ప్రతి సోమవారం నిర్వహించే డయల్ యువర్ సిఎండి కార్యక్రమం ద్వారా తిరుపతి, చిత్తూరు, నెల్లూరు, కడప, అన్నమయ్య, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాల నుంచి వినియోగదారులు మొబైల్ నంబరు: 8977716661కు కాల్ చేసి తమ విద్యుత్…

    Continue Reading

About the Author

Easy WordPress Websites Builder: Versatile Demos for Blogs, News, eCommerce and More – One-Click Import, No Coding! 1000+ Ready-made Templates for Stunning Newspaper, Magazine, Blog, and Publishing Websites.

BlockSpare — News, Magazine and Blog Addons for (Gutenberg) Block Editor

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports